కరోనాపై పోరు.. హైదరాబాద్ సంస్థ ముందడుగు.. కీలక డ్రగ్ తయారీ..!

| Edited By:

Apr 30, 2020 | 10:06 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను అడ్డుకట్టవేసే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఐఐసీటీ ముందడుగు వేసింది.

కరోనాపై పోరు.. హైదరాబాద్ సంస్థ ముందడుగు.. కీలక డ్రగ్ తయారీ..!
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను అడ్డుకట్టవేసే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఐఐసీటీ ముందడుగు వేసింది.ఫేవిపిరావీర్ ఔషధ తయారీలో సులభతర, తక్కువ ఖర్చు విధానం ఐఐసీటీ రూపొందించింది. వివిధ రకాల వైరస్‌లను నియంత్రించడంలో ఫేవిపిరావీర్ ప్రభావవంతంగా పనిచేస్తుండగా.. కోవిడ్-19 వైద్యంలోనూ ఈ డ్రగ్ కీలక పాత్ర పోషిస్తోంది.

కాగా కరోనా వైద్యానికి 25 రకాల ఔషధాలను సీఎస్ఐఆర్ ప్రతిపాదించగా..  అందులో ఫేవిపిరావీర్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. సాధారణ ఫ్లూ జ్వరాలకు ఫేవిపిరావీర్ ను వినియోగిస్తుంటారు. ఈ ఔషధాన్ని జపాన్‌కు చెందిన ఫ్యుజీఫిల్మ్ తయామా కెమికల్స్ కంపెనీ తయారుచేస్తోంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ ఐఐసీటీ ఆవిష్కరణతో చవకగా ఫేవిపిరావీర్ తయారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: జగన్ నిర్ణయం.. మంత్రి గౌతమ్ రెడ్డికి మరో కీలక శాఖ