AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 ప్యాకేజీలతో 39 సరస్సుల సుందరీకరణ: జీహెచ్ఎంసీ

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సరస్సుల సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 36 సరస్సులలో..9 ప్యాకేజీలలో 3ఏళ్ల పాటు కొనసాగించేందుకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పనులు చేపట్టేందుకు..

13 ప్యాకేజీలతో 39 సరస్సుల సుందరీకరణ: జీహెచ్ఎంసీ
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2020 | 2:55 PM

Share

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సరస్సుల సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 36 సరస్సులలో 31 కోట్ల రూపాయల వ్యయంతో సరస్సులలోని గుర్రపుడెక్క తొలగింపు, సుందరీకరణ పనులు చేపట్టడానికి జీహెచ్‌ఎంసీ సన్నద్ధమవుతోంది. ఈ పనులు 9 ప్యాకేజీలలో 3ఏళ్ల పాటు కొనసాగించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు గురువారం సమావేశమైన మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించింది.

ఒప్పందం ప్రకారం ఆయా ఏజెన్సీలు గుర్రపుడెక్కను తొలగించి సరస్సులను శుభ్రంచేయాలి. వ్యర్థాలను జవహర్‌ నగర్‌లో ఉన్న మున్సిపల్‌ డంపింగ్ యార్డుకు తరలించాలి. శుభ్రం చేయడం, రవాణా కార్యకలాపాలను ఏజెన్సీలకే అప్పగిస్తూ స్టాండింగ్‌ కమిటీ ప్రతిపాధించింది. అనంతరం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ..నగరంలో చేపట్టిన మౌలిక వ‌స‌తుల అభివృద్ధి ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రోడ్ల నిర్వహ‌ణ‌, 3వేల మ‌రుగుదొడ్ల నిర్మాణం, బ‌స్ షెల్టర్లు, ఫుట్​పాత్‌ల అభివృద్ది, స్టేడియంల నిర్వహ‌ణ‌, ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిల నిర్మాణం త‌దిత‌ర ప‌నుల ప్రగ‌తిని జోన్ల వారీగా స‌మీక్షించారు.

న‌గ‌రంలో 347 కొత్త బ‌స్ షెల్టర్ల నిర్మాణం చేప‌ట్టగా వాటిలో 90 బ‌స్ షెల్టర్లు పూర్తయ్యాయ‌ని తెలిపారు. ఆగ‌స్టు 15 నాటికి 3 వేల మ‌రుగుదొడ్ల నిర్మాణ ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని అధికారుల‌కు స్పష్టం చేశారు. రోడ్లు వెడ‌ల్పుగా ఉన్నచోట కొత్త బ‌స్‌-బేల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. స‌ర్కిళ్లవారీగా కార్పొరేట‌ర్లు, ఈఈల‌తో ప‌నుల ప్రగ‌తిని చ‌ర్చించ‌డంతో పాటు అత్యవ‌స‌ర ప‌నుల‌ను చేప‌ట్టేందుకు గుర్తించాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్లకు సూచించారు. న‌గ‌రంలో నియోజ‌క‌వ‌ర్గానికి ఒక‌టి చొప్పున మోడ‌ల్ గ్రేవ్ యార్డ్‌ల‌ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌, అద‌నపు క‌మిష‌న‌ర్లు రాహుల్ రాజ్‌, యాద‌గిరిరావు, సీసీపీ దేవేంద‌ర్ రెడ్డి, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు పాల్గొన్నారు.

Follow Us
ఉప్పల్ బాలు వివాదంపై సంచలన వీడియో రిలీజ్ చేసిన నవదీప్
ఉప్పల్ బాలు వివాదంపై సంచలన వీడియో రిలీజ్ చేసిన నవదీప్
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి రానున్న iQOO Z11.. స్పెషాలిటీస్‌
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి రానున్న iQOO Z11.. స్పెషాలిటీస్‌
అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. అల్లం టీ తాగితే కడుపులో..
అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. అల్లం టీ తాగితే కడుపులో..
UGC NET 2026పరీక్ష రద్దు ఎఫెక్ట్.. NTAలో 50మంది ఉద్యోగుల తొలగింపు
UGC NET 2026పరీక్ష రద్దు ఎఫెక్ట్.. NTAలో 50మంది ఉద్యోగుల తొలగింపు
భారీ బ్యాటరీ, ఐపీ68 రేటింగ్‌తో మార్కెట్లోకి వివో Y31T! వివరాలివే
భారీ బ్యాటరీ, ఐపీ68 రేటింగ్‌తో మార్కెట్లోకి వివో Y31T! వివరాలివే
ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులు.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేశారుగా
ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులు.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేశారుగా
రూ.998 ధరతో మార్కెట్లోకి బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్
రూ.998 ధరతో మార్కెట్లోకి బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్
మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే
మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే
మార్కెట్‌లోకి షియోమీ మిక్స్ ఫోల్డ్ 5.. ఫీచర్లు ఇవే
మార్కెట్‌లోకి షియోమీ మిక్స్ ఫోల్డ్ 5.. ఫీచర్లు ఇవే
ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో..
ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో..