AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో కీలక నిర్ణయం దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం..? రైళ్లు, విమానాల రాకపోకలపై అంక్షలు.. కారణం అదేనా..?

దేశంలో మరో దఫా కరోనా వైరస్ కరాళనృత్యానికి జాగ్రత్త చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. మొదటి దశలో పెరిగిన కేసుల దృష్ట్యా రాకపోకలపై అంక్షలు విధించాలని నిర్ణయించింది.

మరో కీలక నిర్ణయం దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం..? రైళ్లు, విమానాల రాకపోకలపై అంక్షలు.. కారణం అదేనా..?
Balaraju Goud
|

Updated on: Nov 20, 2020 | 7:08 PM

Share

దేశంలో మరో దఫా కరోనా వైరస్ కరాళనృత్యానికి జాగ్రత్త చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. మొదటి దశలో పెరిగిన కేసుల దృష్ట్యా రాకపోకలపై అంక్షలు విధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చే విమానాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే, ఈ రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే రైళ్ల సేవలను కూడా నిలిపివేయాలని చూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కొవిడ్ కేసుల సంఖ్య పెరగుతుండటంతో కఠిన నిర్ణయం తప్పదంటున్నారు నిపుణులు.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 28 నుంచి ఢిల్లీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నవంబర్‌ 11న మరోసారి 8వేల మార్కును దాటి ఆందోళనకు గురిచేసింది. అలాగే, గడిచిన 24 గంటల్లో 7,500 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలో దిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలకు ఉపక్రమించింది. వివాహ వేడుకల వంటి శుభకార్యాలకు 50 మందిని మాత్రమే అనుమతించడం, మాస్క్‌ ధరించని వారికి రూ.2,000 జరిమానా విధించడం వంటి చర్యలు చేపడుతోంది.

ఇక, కొవిడ్-19 కేసులు అధిక సంఖ్యలో వెలుగుచూస్తోన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఉన్నతస్థాయి బృందాలను పంపే యోచనలో ఉన్నట్లు శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వెలుగులోకిరాని కేసులను గుర్తించేందుకు విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాలకు సూచించింది. మరోసారి కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అవసరమైతే, కంటైన్మెంట్ జోన్లను పెంచాలని సూచించింది.

Follow Us
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2..
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2..
మాస్ మంత్రం పఠిస్తున్న క్లాస్‌ స్టార్స్‌... రూటెందుకు మారుస్తున్న
మాస్ మంత్రం పఠిస్తున్న క్లాస్‌ స్టార్స్‌... రూటెందుకు మారుస్తున్న
కుండీలు కొనాల్సిన పనిలేదు.. మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు..
కుండీలు కొనాల్సిన పనిలేదు.. మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు..
దేశ ద్రోహానికి పాల్పడ్డడంటూ జో కెంట్‌పై విచారణ..!
దేశ ద్రోహానికి పాల్పడ్డడంటూ జో కెంట్‌పై విచారణ..!
వివాదంలో కేడీ ది డెవిల్ మూవీ.. లేటెస్ట్ సాంగ్‌ మీద విమర్శలు
వివాదంలో కేడీ ది డెవిల్ మూవీ.. లేటెస్ట్ సాంగ్‌ మీద విమర్శలు
మీ ఇంట్లో 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉందా? ఈ నియమాలు తెలుసా?
మీ ఇంట్లో 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉందా? ఈ నియమాలు తెలుసా?
ఎల్లమ్మ నుంచి ఆ హీరోయిన్ కూడా అవుట్.?
ఎల్లమ్మ నుంచి ఆ హీరోయిన్ కూడా అవుట్.?
సమ్మర్‌ సినిమాలే కీలకం..అందాల భామల ఆశలన్నీ వాటి మీదే!
సమ్మర్‌ సినిమాలే కీలకం..అందాల భామల ఆశలన్నీ వాటి మీదే!
జూన్‌ 1 నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభం.. వేసవిసెలవులు ఎప్పట్నుంచంటే
జూన్‌ 1 నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభం.. వేసవిసెలవులు ఎప్పట్నుంచంటే
చైత్ర నవరాత్రి 2026: 3 శుభ యోగాలు.. ఈ రాశులపై అదృష్టం జాక్‌పాట్!
చైత్ర నవరాత్రి 2026: 3 శుభ యోగాలు.. ఈ రాశులపై అదృష్టం జాక్‌పాట్!