AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో కీలక నిర్ణయం దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం..? రైళ్లు, విమానాల రాకపోకలపై అంక్షలు.. కారణం అదేనా..?

దేశంలో మరో దఫా కరోనా వైరస్ కరాళనృత్యానికి జాగ్రత్త చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. మొదటి దశలో పెరిగిన కేసుల దృష్ట్యా రాకపోకలపై అంక్షలు విధించాలని నిర్ణయించింది.

మరో కీలక నిర్ణయం దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం..? రైళ్లు, విమానాల రాకపోకలపై అంక్షలు.. కారణం అదేనా..?
Balaraju Goud
|

Updated on: Nov 20, 2020 | 7:08 PM

Share

దేశంలో మరో దఫా కరోనా వైరస్ కరాళనృత్యానికి జాగ్రత్త చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. మొదటి దశలో పెరిగిన కేసుల దృష్ట్యా రాకపోకలపై అంక్షలు విధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చే విమానాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే, ఈ రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే రైళ్ల సేవలను కూడా నిలిపివేయాలని చూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కొవిడ్ కేసుల సంఖ్య పెరగుతుండటంతో కఠిన నిర్ణయం తప్పదంటున్నారు నిపుణులు.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 28 నుంచి ఢిల్లీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నవంబర్‌ 11న మరోసారి 8వేల మార్కును దాటి ఆందోళనకు గురిచేసింది. అలాగే, గడిచిన 24 గంటల్లో 7,500 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలో దిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలకు ఉపక్రమించింది. వివాహ వేడుకల వంటి శుభకార్యాలకు 50 మందిని మాత్రమే అనుమతించడం, మాస్క్‌ ధరించని వారికి రూ.2,000 జరిమానా విధించడం వంటి చర్యలు చేపడుతోంది.

ఇక, కొవిడ్-19 కేసులు అధిక సంఖ్యలో వెలుగుచూస్తోన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఉన్నతస్థాయి బృందాలను పంపే యోచనలో ఉన్నట్లు శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వెలుగులోకిరాని కేసులను గుర్తించేందుకు విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాలకు సూచించింది. మరోసారి కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అవసరమైతే, కంటైన్మెంట్ జోన్లను పెంచాలని సూచించింది.

Follow Us
: రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
: రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!