జూన్-జూలై నాటికి భారత్లో కరోనా విశ్వరూపం.. ఎయిమ్స్ డైరెక్టర్ వెల్లడి.!
జూన్-జూలై నాటికి దేశంలో కరోనా వైరస్ పీక్ స్టేజికి వెళ్లే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న కేసుల ప్రకారం జూన్-జూలై నెలల్లో ఆ సంఖ్య మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందువల్ల రెడ్, కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్లో కరోనా కేసుల పెరుగుదల రేటు నిలకడగా ఉందన్న ఆయన దేశంలో కరోనా ఎప్పుడు […]
జూన్-జూలై నాటికి దేశంలో కరోనా వైరస్ పీక్ స్టేజికి వెళ్లే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న కేసుల ప్రకారం జూన్-జూలై నెలల్లో ఆ సంఖ్య మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందువల్ల రెడ్, కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
భారత్లో కరోనా కేసుల పెరుగుదల రేటు నిలకడగా ఉందన్న ఆయన దేశంలో కరోనా ఎప్పుడు తీవ్రరూపం దాల్చుతుందో ఖచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952కు చేరింది. మరణాల సంఖ్య 1,783కు చేరుకుంది. ఇక దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్ర(16,758)లో నమోదయ్యాయి.
Read This: భారత్ కుట్రపూరిత చర్యలపై ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాః ఇమ్రాన్ ఖాన్