కరోనా అప్డేట్స్‌.. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు..

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం నాటికి.. మొత్తం 7529 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 768 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 6634 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 653 మంది కరోనాను విజయవంతంగా ఎదుర్కొని.. డిశ్చార్జ్ అయ్యారని.. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 242 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా.. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అన్ని రాష్ట్రాల సీఎంలో […]

Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 10:41 PM

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం నాటికి.. మొత్తం 7529 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 768 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 6634 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 653 మంది కరోనాను విజయవంతంగా ఎదుర్కొని.. డిశ్చార్జ్ అయ్యారని.. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 242 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా.. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అన్ని రాష్ట్రాల సీఎంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడగించాలని ప్రధానిని కోరారు. అంతేకాదు.. పలు రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ఆదేశాలు జారీచేశాయి.