కరోనా ఎఫెక్ట్ : ఖైదీల విడుదల
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలూ లాక్ డౌన్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ దాటికి భారత్ కూడా విలవిలలాడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారిని తరిమేందుకు ఇప్పటికే ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. తాజాగా కరోనా విజృంభించకుండా జైళ్ల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జైళ్లలో కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఖైదీలను పెరోల్, బెయిల్పై విడుదల చేస్తున్నారు. […]
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలూ లాక్ డౌన్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ దాటికి భారత్ కూడా విలవిలలాడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారిని తరిమేందుకు ఇప్పటికే ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. తాజాగా కరోనా విజృంభించకుండా జైళ్ల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జైళ్లలో కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఖైదీలను పెరోల్, బెయిల్పై విడుదల చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఢిల్లీ జైళ్ల శాఖ మొత్తం మూడువేల మంది ఖైదీలను తీహార్ జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతగా శిక్ష అనుభవిస్తున్న, రిమాండ్లో ఉన్న 419 మంది ఖైదీలను విడుదల చేసింది. వీరిలో 356 మందికి 45 రోజులపాటు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అలాగే మరో 63 మందికి ఎనిమిది వారాల అత్యవసర పెరోల్ మంజూరు చేసింది.
అటు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 71 జైళ్ల నుంచి 11 వేల మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేయాలని నిర్ణయించింది.