ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు అలర్ట్.. రిజర్వేషన్లు క్లోజ్..డబ్బులు వెనక్కి
ఆర్టీసీ బస్సులను లాక్ డౌన్ ముగిసిన అనంతరం 15వ తేదీ బుధవారం నుంచి నడిపించాలన్న ఆలోచనతో ముందస్తు రిజర్వేషన్లను ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ. ఈ క్రమంలో భారీ సంఖ్యలో బుకింగ్స్ కూడా జరిగాయి. అయితే తాజాగా టికెట్లనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడం, లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలుండటంతో…రిజర్వేషన్లను నిలిపివేసినట్టు ఏపీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. రిజర్వేషన్ చేయించుకున్న వారందరికీ నగదును.. వారి వారి బ్యాంకు ఖాతాలకు క్రెడిట్ చేస్తామని తెలిపింది. […]
ఆర్టీసీ బస్సులను లాక్ డౌన్ ముగిసిన అనంతరం 15వ తేదీ బుధవారం నుంచి నడిపించాలన్న ఆలోచనతో ముందస్తు రిజర్వేషన్లను ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ. ఈ క్రమంలో భారీ సంఖ్యలో బుకింగ్స్ కూడా జరిగాయి. అయితే తాజాగా టికెట్లనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడం, లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలుండటంతో…రిజర్వేషన్లను నిలిపివేసినట్టు ఏపీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. రిజర్వేషన్ చేయించుకున్న వారందరికీ నగదును.. వారి వారి బ్యాంకు ఖాతాలకు క్రెడిట్ చేస్తామని తెలిపింది. గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చిన తరువాత మాత్రమే, తిరిగి రిజర్వేషన్ల సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేసింది.