AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను జయించిన కిడ్నీ పేషెంట్‌..వైద్యం అందక అవస్థలు!

యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కరోనా బారినపడి కోలుకున్న ఓ కిడ్నీ పేషెంట్‌ను కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలోని తుర్కపల్లి మండలం..

కరోనాను జయించిన కిడ్నీ పేషెంట్‌..వైద్యం అందక అవస్థలు!
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2020 | 4:33 PM

Share

యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కరోనా బారినపడి కోలుకున్న ఓ కిడ్నీ పేషెంట్‌ను కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలోని తుర్కపల్లి మండలం మాదాపూర్‌కు చెందిన వ్యక్తి ఏడేళ్ల క్రితం కిడ్నీలు చెడిపోవడంతో..అప్పట్నుంచి ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు.

ఇదే క్రమంలో డయాలిసిస్ చేయించుకోవడానికి వెళ్లగా.. అదే ఆస్పత్రికి వచ్చిన మరో కిడ్నీపేషెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ రోజు డయాలిసిస్ చేయించుకున్న వారందరికీ కరోనా టెస్టులు చేయగా..ఇతడికి కూడా కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన అతడు 16 రోజుల చికిత్స అనంతరం కోలుకొని ఇంటికి వెళ్లాడు.

తిరిగి మళ్లీ డయాలసిస్ చేయించుకోవడం కోసం తాను గతంలో వెళ్లిన ఆస్పత్రికి వెళ్లగా..ఇప్పుడు డయాలసిస్ చేయడం కుదరదు.. మరో ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. వేరే ఆస్పత్రికి వెళితే..అక్కడా కుదరదని చెప్పారు. చివరకు దగ్గర్లోని ఆలేరు ఆస్పత్రికి వెళ్లగా.. కరోనా నుంచి కోలుకున్నా 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. కాబట్టి క్వారంటైన్ గడువు ముగిశాక రావాలని సూచించారు. దీంతో బాధితుడు ఆందోళనకు గురవుతున్నాడు. మూడు రోజులకోసారి డయాలిసిస్ చేయించుకోవాల్సి రావడం.. మరోవైపు ఆస్పత్రులు తిప్పి పంపుతుండటంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Follow Us
ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులు.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేశారుగా
ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులు.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేశారుగా
రూ.998 ధరతో మార్కెట్లోకి బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్
రూ.998 ధరతో మార్కెట్లోకి బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్
మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే
మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే
మార్కెట్‌లోకి షియోమీ మిక్స్ ఫోల్డ్ 5.. ఫీచర్లు ఇవే
మార్కెట్‌లోకి షియోమీ మిక్స్ ఫోల్డ్ 5.. ఫీచర్లు ఇవే
ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో..
ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో..
అప్పట్లో రోజుకు రూ.3 కూలీ.. ఇప్పుడు రూ.160 కోట్ల కంపెనీకి ఓనర్!
అప్పట్లో రోజుకు రూ.3 కూలీ.. ఇప్పుడు రూ.160 కోట్ల కంపెనీకి ఓనర్!
రెండు తింటే ఇమ్యూనిటీ డబుల్ చేసి డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ మాయం
రెండు తింటే ఇమ్యూనిటీ డబుల్ చేసి డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ మాయం
ఆగస్టు 18 రాశిఫలాలు: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్..
ఆగస్టు 18 రాశిఫలాలు: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్..
యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియో ప్రైమ్‌ రీఎంట్రీ.. ఏడాది పాటు..
యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియో ప్రైమ్‌ రీఎంట్రీ.. ఏడాది పాటు..
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!