షాకింగ్.. 11 మంది కూరగాయల వ్యాపారులను కాటేసిన మహమ్మారి..

| Edited By:

Apr 29, 2020 | 8:24 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో ముప్పై వేల పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వెయ్యి మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద మొత్తంలోనే నమోదయ్యాయి. తాజాగా.. ఇక్కడి ప్రాంతంలోని మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండి గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇక్కడ వ్యాపారం […]

షాకింగ్.. 11 మంది కూరగాయల వ్యాపారులను కాటేసిన మహమ్మారి..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో ముప్పై వేల పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వెయ్యి మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద మొత్తంలోనే నమోదయ్యాయి. తాజాగా.. ఇక్కడి ప్రాంతంలోని మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండి గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇక్కడ వ్యాపారం చేసే పదకొండు మంది వ్యాపారులకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ వ్యాపారులెవరూ మండితో డైరక్ట్‌ లింక్ లేని వారని తెలిపారు. అయితే ఈ వ్యాపారులకు సంబంధించిన దుకాణాలతో పాటుగా.. సమీపంలోని షాపులను కూడా మూసేసినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.