TG JL Final Results: ‘జేఎల్‌ తుది ఫలితాలు వెంటనే విడుదల చేయాలి’ నిరుద్యోగుల డిమాండ్‌

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్‌ లెక్చరర్ల పరీక్ష తుది ఫలితాలు వెంటనే విడుదల చేసి నియామక పత్రాలు అందజేయాలని జేఎల్‌ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజాభవన్‌కు చేరుకున్న అభ్యర్ధులు తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు..

TG JL Final Results: 'జేఎల్‌ తుది ఫలితాలు వెంటనే విడుదల చేయాలి' నిరుద్యోగుల డిమాండ్‌
TG JL Final Results
Follow us

|

Updated on: Oct 07, 2024 | 6:45 AM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 7: తెలంగాణ రాష్ట్రంలో జూనియర్‌ లెక్చరర్ల పరీక్ష తుది ఫలితాలు వెంటనే విడుదల చేసి నియామక పత్రాలు అందజేయాలని జేఎల్‌ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజాభవన్‌కు చేరుకున్న అభ్యర్ధులు తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీతో మాట్లాడి వెంటనే జేఎల్‌ పోస్టుల తుది ఫలితాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీతో పాటు జేఎల్‌ నియామక పత్రాలు ఇవ్వాలని కోరుతూ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ కోదండరాంను కూడా ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కాగా మొత్తం 1,392 జేఎల్‌ పోస్టులకు ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. నెలలు గడుస్తున్న తుది ఫలితాలు వెలువరించక పోవడంతో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు.

నవంబర్‌ 24 నుంచి యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఐఎఫ్‌ఎస్‌)-2024 మెయిన్స్‌ పరీక్ష నిర్వహణ తేదీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు మెయిన్స్‌ తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ పరీక్షలు నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 1 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో మొత్తం 150 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

సబ్జెక్టుల వారీగా ఐఎఫ్‌ఎస్‌ ప్రధాన పరీక్ష తేదీల వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ డీఎస్సీ అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి.. 24,466 మంది హాజరు

తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తైంది. మొత్తం 25,924 మంది అభ్యర్ధులకు అవకాశం కల్పించగా 24,466 మంది హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. అంటే దాదాపు 1,458 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాలేదు. వికారాబాద్‌ జిల్లాలో 923 మందికి 400, కొత్తగూడెంలో 1018కి 936, హైదరాబాద్‌లో 1537కి 1355 మంది హాజరయ్యారు. మంచిర్యాల జిల్లాలో 715 మందికి ఒక్కరు చొప్పున గైర్హాజరయ్యారు. ఇక నేడో రేపో 1:1 చొప్పున తుది ఫలితాలు వెల్లడించి, అక్టోబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా నియామక పత్రాలు అందజేయనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.