
హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ పదో తరగతి ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల చేశారు. మొత్తం 5,07,107 ముంది విద్యార్ధులు హాజరుకాగా వీరిలో 4,96,374 విద్యార్ధులు రెగ్యులర్, 10,733 మంది విద్యార్ధులు ప్రైవేట్గా రాశారు. గతేడాది 5,05,813 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. తాజా ఫలితాల్లో 92.78 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ప్రైవైటు కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ అధిక ఉత్తీర్ణత సాధించాయి.
4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. కేవలం 2 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రైవేట్, రెగ్యులర్కు కలిపి మొత్తం పదో తరగతి ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరిగానే బాలికలు సత్తా చాటారు. బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా.. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే బాలికలు దాదాపు 6.56 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 15వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికాగా.. మార్కుల ఆల్లైన్ ప్రక్రియ కూడా విద్యాశాఖ వేగవంతంగానే పూర్తి చేసింది. ఈ ఏడాది నుంచి పదో తరగతిలో గ్రేడ్ విధానాన్ని తొలగించిన అధికారులు తాజా ఫలితాల్లో విద్యార్ధులందరికీ సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు, ఒక్కో సబ్జె్క్టుకు గ్రేడ్లు కూడా ఇచ్చారు. అంతేకాకుండా మార్కుల మెమోలపై పాస్, ఫెయిల్ అని కూడా మెమోలపై విద్యాశాఖ వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.