
హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 16తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. పేపర్ల స్కానింగ్ కూడా ముగిసిన వెంటనే మార్కుల క్రోడీకరణ (ట్యాబ్యులేషన్) చేపడతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో వెల్లడించేందుకు విద్యాశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించేందుకు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఎటువంటి అడ్డంకులు లేకుంటే మే 4 లేదా 5వ తేదీల్లో అధికారికంగా ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 25వ తేదీతో మూల్యాంకనం ప్రక్రియ ముగిసింది. మార్కుల క్రోడీకరణకు పది రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియను కూడా కాస్త వేగంగానే పూర్తి చేసి అనుకున్న దానికంటే ముందుగానే ప్రకటించాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్ సైట్ తో పాటు టీవీ9 తెలుగు వెబ్ సైట్ లోనూ టెన్త్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు ఈ విద్యాసంవత్సరం నుంచి అధికారిక వెబ్సైట్తోపాటు వాట్సాప్లోనూ తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇప్పటికే హాల్టికెట్లను సైతం వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు ఫలితాలను సైతం వాట్సాప్ ద్వారా తెలుసుకొనే సదుపాయం కల్పించింది. వాట్సాప్ ద్వారా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 80969 58096 నంబర్కు ‘Hi’ అని మెసేజ్ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్చేసి హాల్టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ వెంటనే ఫలితాలు స్క్రీన్పై ప్రత్యక్షమవుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.