AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS ECET 2025 Result Today: మరికొన్ని గంటల్లోనే ఈసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు మే12న నేడు ఈసెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు ఆదివారం (మే 25) విడుదలకానున్నాయి. ఈ మేరకు టీజీ ఈసెట్‌ ఫలితాలు..

TS ECET 2025 Result Today: మరికొన్ని గంటల్లోనే ఈసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
ECET 2025 Results
Srilakshmi C
|

Updated on: May 25, 2025 | 1:27 PM

Share

హైదరాబాద్‌, మే 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు మే12న నేడు ఈసెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు ఆదివారం (మే 25) విడుదలకానున్నాయి. ఈ మేరకు టీజీ ఈసెట్‌ ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదలకానున్నట్లు ఈసెట్‌ కన్వీనర్‌ పి.చంద్రశేఖర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్‌ ఎం కుమార్‌ ఈ రోజు ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈసెట్‌ ఫలితాలు విడుదల అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకుని ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్‌ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది కూడా ఈసెట్‌ పరీక్షను హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన విషయం తెలిసిందే.

SBI PO మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పటి నుంచంటే?

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2024 పోస్టులకు సంబంధించి మే 5వ తేదీన నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఎంపికైన వారి వివరాలను ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. చివరి దశ అయిన ఇంటర్వ్యూలు జూన్‌ 5వ తేదీ నుంచి 9 వరకు జరగనున్నాయి. ఇక సైకోమెట్రిక్‌ టెస్ట్‌ మే 31న నిర్వహించనున్నారు. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచుల్లో మొత్తం 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకుగానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ