
హైదరాబాద్, మార్చి 2: రైల్వే శాఖ ఆధ్వర్యంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్) పరీక్షలు ఈ రోజు (మార్చి 2) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి రైల్వే శాఖ అడ్మిట్ కార్డులను కూడా తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
కాగా మొత్తం 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆర్ఆర్బీ ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకు 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు చొప్పున కేటాయిస్తారు. అలాగే తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కుల కోత విధిస్తారు. ఇక ప్రయత్నించని ప్రశ్నలకు మార్కులు కలపడం, తీసివేయడం ఉండదు. రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) అనంతరం ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
ఆర్ఆర్బీ ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ పరీక్ష అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.