AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2026 Final Answer Key: జేఈఈ మెయిన్‌ సెషన్ 1 తుది ఆన్సర్‌ కీ విడుదల.. ఏ క్షణమైనా ఫలితాలు వెల్లడి!

దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జేఈఈ మెయిన్‌ 2026 ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సోమవారం ఉదయం NTA అధికారులు జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల ఫైనల్ కీ విడుదల చేశారు. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ రోజే ఫలితాలు కూడా ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది..

JEE Main 2026 Final Answer Key: జేఈఈ మెయిన్‌ సెషన్ 1 తుది ఆన్సర్‌ కీ విడుదల.. ఏ క్షణమైనా ఫలితాలు వెల్లడి!
JEE Main 2026 session 1 final answer key
Srilakshmi C
|

Updated on: Feb 16, 2026 | 3:15 PM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16: ఎన్టీయే ఈ రోజు జేఈఈ మెయిన్‌ 2026 ఫలితాలు విడుదల చేయనున్నట్లు గత వారం ఎక్స్‌ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సోమవారం ఉదయం NTA అధికారులు జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల ఫైనల్ కీ విడుదల చేశారు. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ రోజే ఫలితాలు కూడా ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది.

గతంలో జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 12న జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16న ఫలితాలు ప్రకటిస్తామని ఎన్టీయే అధికారికంగా ప్రకటించింది. ఎన్‌టీఏ ప్రకటన మేరకు సోమవారం ఏ క్షణంలోనైనా జేఈఈ మెయిన్‌ 2026 ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలు విడుదల తర్వాత అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టినతేదీ వివరాలను జేఈఈ మెయిన్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి రిజల్ట్స్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం యేటా జేఈఈ మెయిన్‌ పరీక్షలు రెండు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి తొలి విడత పరీక్షలు జనవరి 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి.

బీఈ/బీటెక్‌, బీఆర్క్‌కు ప్రవేశాలు కల్పించే పేపర్ 1, 2 పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 13.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో దాదాపు 95 శాతం మంది పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ఫిబ్రవరి 4న విడుదల చేయగా.. ఫిబ్రవరి 6 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. వచ్చిన అభ్యంతరాల ఆధారంగా తుది కీ రూపొందించి ఈ రోజు విడుదల చేశారు. మరికాసేపట్లో జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. అయితే ర్యాంకులు మాత్రం చివరి విడత పరీక్షలు ముగిసిన తర్వాత మాత్రమే వెల్లడవుతాయి. కేవలం మార్కులు మాత్రమే ఈ రోజు విడుదలవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us