Job Skills: మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి.. కొత్త ఏడాది నేర్చుకోకపోతే ఇక అంతే

| Edited By: Ram Naramaneni

Dec 09, 2023 | 10:25 PM

ముఖ్యంగా కోడింగ్, డిజైనింగ్, రాయడం వంటివి మిమ్మల్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేస్తుంది. కాబట్టి ఉద్యోగార్థులు కచ్చితంగా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మంచి నైపుణ్యం ఉంటే మంచి ఉద్యోగంతో మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో నైపుణ్యాల విషయంలో భారతదేశంలో కొత్త ఏడాది వచ్చే మార్పులను ఓ సారి తెలుసుకుందాం.

Job Skills: మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి.. కొత్త ఏడాది నేర్చుకోకపోతే ఇక అంతే
Jobs
Follow us on

మంచి ఉద్యోగం అనేది ప్రతి నిరుద్యోగి కల. అయితే ఉద్యోగం అనేది చదువుతో పాటు మన ప్రతిభకకు కొలమానంగా చాలా మంది భావిస్తారు. అయితే మంచి ఉద్యోగం కావాలంటే మాత్రం నైపుణ్యం చాలా అవసరం. నైపుణ్యాలు అనేవి అభిరుచులను అనుగుణంగా ఉంటాయి. ముఖ్యంగా కోడింగ్, డిజైనింగ్, రాయడం వంటివి మిమ్మల్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేస్తుంది. కాబట్టి ఉద్యోగార్థులు కచ్చితంగా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మంచి నైపుణ్యం ఉంటే మంచి ఉద్యోగంతో మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో నైపుణ్యాల విషయంలో భారతదేశంలో కొత్త ఏడాది వచ్చే మార్పులను ఓ సారి తెలుసుకుందాం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సస్టైనబిలిటీ అండ్‌ డీకార్బనైజేషన్, సరఫరా గొలుసులపై జియోపాలిటిక్స్ ప్రభావం వల్ల ప్రపంచం చాలా ఎక్కువగా ప్రభావితమైందని నిపుణులు భావిస్తున్నారు. ఏఐ విప్లవం సరికొత్తది. సుస్థిరతపై ఒత్తిడి వేగవంతమైంది. భౌగోళిక రాజకీయాలు ముఖ్యమైనవిగా మారాయి, ఎందుకంటే ఇది సరఫరా గొలుసులను బాగా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం అవసరమైన సంప్రదాయ నాయకత్వ నైపుణ్యాలకు అదనంగా ఈ నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన కొత్త నిపుణుల సాయం కోరుతుంది. టెక్నాలజీ స్కిల్స్‌లో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. కాబట్టి భారతదేశంలో ఏఐకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థకు సంఘటిత రంగం యొక్క సహకారం పెరుగుతున్నందున అధికారిక సీఎక్స్‌ఓ నైపుణ్యాల అవసరం ముఖ్యమైనవి. 

నైపుణ్యం పెంచుకోవాల్సిన రంగాలు

ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు, బ్యాటరీలు, ఛార్జింగ్ పాయింట్లు, గ్రీన్ ఎనర్జీ మొదలైన వాటితో సహా మొత్తం విద్యుదీకరణ సరఫరాలో ఉద్యోగార్థులు నైపుణ్యం పెంచుకోవాల్సి ఉంటుంది. సేవల రంగంలో ఏఐ, డిజిటల్ అత్యంత ముఖ్యమైన ప్రభావం చూపుతాయని నిపుణుల భావన. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు డిజిటల్ సిటిజన్ సేవలు మరియు సుస్థిరత కీలకం. ప్రభుత్వం సుస్థిరత విషయంలో గట్టిగా ఒత్తిడి చేస్తోంది. ఈ విధానం ద్వారా ఆర్థిక వ్యవస్థను డీకార్బనైజ్ చేయడంపై ఒత్తిడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ఎడ్యుకేషన్ ప్రొవైడర్లు 2024 నుంచి కచ్చితం మార్కెట్‌కు అనుగుణంగా విద్యార్థులకు తర్ఫీదునివ్వాల్సి ఉంటుంది. శిక్షకులు తప్పనిసరిగా ఏఐ, డిజిటల్, సస్టైనబిలిటీ, సప్లై చైన్ రెసిలెన్స్, పెరుగుతున్న డిజిటల్, ఆర్గనైజ్డ్ ఎకానమీలో సీఎక్స్‌ఓల కోసం కోర్సులను అందించాలి. ముఖ్యంగా ఫ్యాకల్టీని అప్‌గ్రేడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు చదువుతున్నప్పుడే ఉత్పాదక ఏఐను ఉపయోగించుకునే పరిస్థితిని నిర్వహించడానికి వారు విధానాలను రూపొందించాలి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.