AP 10th class Supply Exams 2022: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌! జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. రేపట్నుంచి..

|

Jun 06, 2022 | 4:39 PM

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల (AP SSC Results 2022) ఫలితాలు ఈరోజు ( జూన్ 6)న విడుదలైన విషయం తెలిసిందే. పరీకల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు రేపట్నుంచి..

AP 10th class Supply Exams 2022: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌! జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. రేపట్నుంచి..
Ap Supply Exams
Follow us on

AP 10th Class Supply Time Table 2022: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల (AP SSC Results 2022) ఫలితాలు ఈరోజు ( జూన్ 6)న విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 6,21,799ల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా 4,14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అంటే కేవలం 67.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత రెండేళ్లగా పరీక్షలు నిర్వహించని ఏపీ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు ఈ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో గ్రేడులకు బదులు మార్కుల రూపంలో ఫలితాలను వెల్లడించింది. ఐతే రాష్ట్రంలోని31 ప్రైవేట్ పాఠశాలలతో సహా మొత్తం 71 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదయ్యింది.

కాగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష (AP SSC Supplementary Exam 2022)లను జులై 6 నుంచి 15 వరకు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలియజేసారు. ఏపీ పదో తరగతి పరీక్ష 2022ల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 13 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజును రేపటి (జూన్ 7) నుంచి చెల్లించవచ్చన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. ర్యాంకుల సంస్కృతికి అడ్డుకట్టవేసేందుకు ఈ ఏడాది ఫలితాల్లో తమ స్కూల్‌ విద్యార్థులు అధిక ర్యాంకులు సాధించారని ఎవరైనా ప్రకటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఎవరైనా ప్రకటనలు జారీచేస్తే వారిపై కేసులు పెడతామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.