Fact Check: బైజుస్‌తో ఏపీ సర్కార్ ఒప్పందంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

| Edited By: Ravi Kiran

Jun 18, 2022 | 7:00 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు విద్యాశాఖ బైజూస్‌ (BYJU's) ఎడ్-టెక్ కంపెనీతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..

Fact Check: బైజుస్‌తో ఏపీ సర్కార్ ఒప్పందంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
Ap Govt Mou With Byju's
Follow us on

AP Education News: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం జగన్ బైజూస్‌ (BYJU’s) ఎడ్-టెక్ కంపెనీతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీడియాతో ఈ విధంగా మాట్లాడారు.. ‘ఎడ్-టెక్ కంపెనీ రూపొందించిన కంటెంట్‌ యాక్సెస్ చేసిన ట్యాబ్‌లను ప్రతి ఏడాది 8 వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు పంపిణీ చేస్తాం. వాళ్లు 9వ తరగతికి చేరే సరికి ఆ ట్యాబ్‌లలోని కంటెంట్‌ అప్‌గ్రేడ్‌ అవుతుంది. ఆ తర్వాత 10వ తరగతిలోకి వెళ్లేసరికి కంటెంట్‌ మళ్లీ అప్‌గ్రేడ్‌ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఏడాది 8వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేస్తాం. ఫలితంగా సీబీఎస్సీ పరీక్షల్లో పాస్‌ కావడానికి విద్యార్ధులకు ఉపయోగపడుతుంది. ఈ ఏడాది పాఠ్య పుస్తకాలు ఇప్పటికే ముద్రించబడినందున వచ్చే ఏడాది నుంచి 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ద్విభాషా పాఠ్య పుస్తకాల్లో బైజు కంటెంట్‌ను పొందుపరుస్తాం’ అని సీఎం జగన్ అన్నారు.

ఇంకా ఈ విధంగా మట్లాడారు.. ‘బైజూస్‌ కంపెనీ కూడా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్ధులకు అనుగుణంగా స్పంధించింది. బైజుస్‌ కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి, ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థికి సుమారుగా రూ. 20,000ల నుంచి రూ. 24,000ల వరకు ఖర్చవుతుంది. ఐతే ఈ విధమైన కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు బైజూస్‌ ముందుకు రావడం శుభపరిణామం. కంటెంట్‌ ఫ్రీ.. ట్యాబ్‌లకు మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. ప్రతీ ఏటా 4 లక్షల 70 వేల ట్యాబ్‌లను పంపిణీ చేయడానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చవుతుంది. అత్యధిక ఖర్చుతో కూడుకున్నప్పటికీ క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని’ సీఎం జగన్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదీ వాస్తవం: ఒక ట్యాబ్లెట్ ఖరీదు రూ. 4 లక్షల 70 వేలు అవుతుందన్నట్లు  సీఎం జగన్ మాట్లాడారని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం జరుగుతోంది. 4 లక్షల 70 వేల మంది విద్యార్ధులకు ట్యాబ్ లను పంపిణీ చేస్తున్నట్లు, అందుకు అయ్యే ఖర్చు గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. దీనిపై ఈ విధంగా అధికారులు ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.