AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET 2022: విద్యార్థులకు అలర్ట్‌.. ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా చెక్‌ చేసుకోండి..

AP EAPCET 2022: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను...

AP EAPCET 2022: విద్యార్థులకు అలర్ట్‌.. ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా చెక్‌ చేసుకోండి..
TS Inter Supply Results
Narender Vaitla
|

Updated on: Jul 26, 2022 | 11:29 AM

Share

AP EAPCET 2022: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈసారి ఇంజనీరింగ్‌లో 89.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, వ్యవసాయ విభాగంలో 95.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.

ఈఏపీసెట్‌ పరీక్షలను జులై 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. 3,84,000 మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. పరీక్షలకు మొత్తం 2,82,496 మంది హాజరుకాగా, ఇందులో ఇంజనీరింగ్ పరీక్ష 1,94,752, వ్యవసాయ కోర్సుకు 87,744 మంది రాశారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..