
అమరావతి, మే 4: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. తాజా షెడ్యూల్ ప్రకారం..
ఈ పరీక్షలన్నీ ఆయా తేదీల్లో ఆన్లైన్ విధానంలో షిఫ్టుల వారిగా ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు హాల్ టికెట్, ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్, పాప్పోర్ట్, ఓటర్..వంటివి తీసుకెళ్లాలి. అలాగే ఒక బ్లాక్ లేదా బ్లూ కలర్ పెన్ తమతోపాటు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు సూచనలు మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కింది అధికారిక ప్రకటన ద్వారా తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఫెయిలైన విద్యార్ధులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తుంది. ఈ మేకు విద్యాశాఖ ప్రణాళిక విడుదల చేసింది. పదిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 19 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మే 18 వరకు విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. మండల కేంద్రాల్లో కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సాధ్యం కానప్పుడు ఏ పాఠశాలకు ఆ పాఠశాలలో కోచింగ్ నిర్వహించాలని అధికారులను తెలిపింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.