
అమరావతి, ఏప్రిల్ 22: రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ దేవానంద రెడ్డి ఈ రోజు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి చివరి పని దినానికి ముందుగానే పదో తరగతి ఫలితాలు విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ ఏడాది పాఠశాలలకు లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23వ తేదీ. ఇక ఈ సారి 6.16 వేల రెగ్యులర్ విద్యార్ధులు పరీక్షలకు హాజరవగా.. ఒక్క విద్యార్ధి కూడా మాల్ ప్రాక్టీస్కు పాల్పడలేదు. 8 రోజుల్లో వాల్యుయేషన్ కంప్లీట్ చేసి, 22 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించారు. మొత్తం 6,16,615 మంది పరీక్షలకు హాజరవగా వీరిలో 5,34,574 మంది ఉత్తీర్ణత (86.69 శాతం) ఉత్తీర్ణత పొందారు. బాలురు 84.02 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత పొందారు.
ఈ రోజు విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో సబ్జెక్ట్ వారీగా ఉత్తీర్ణత శాతం చూస్తే..
మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.