Telugu News Education Career Jobs Andhra Pradesh Inter Board extends last date for payment of fee till October 31, Check public exams full time table here
AP Inter Public Exams 2026: ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. ఫీజు చెల్లింపుపై తాజా అప్డేట్ ఇదే
AP Inter Exams 2026 Time Table: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు 2026 వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పూర్తి టైం టేబుల్ కూడా విడుదల చేసింది. ఇక పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ కూడా మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఒకసారి ఫీజు చెల్లింపుల గడువును పొడిగించిన ఇంటర్ బోర్డు..
అమరావతి, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు 2026 వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పూర్తి టైం టేబుల్ కూడా విడుదల చేసింది. ఇక పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ కూడా మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఒకసారి ఫీజు చెల్లింపుల గడువును పొడిగించిన ఇంటర్ బోర్డు తాజాగా మరోమారు తుది గడువును పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు అక్టోబర్ 31వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఏపీ ఇంటర్ బోర్డ్ తెలిపింది. దీంతో మరో 4 రోజులు పొడిగించినట్లు ఏపీ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి వెల్లడించారు. రూ.1000 ఆలస్య రుసుంతో నవంబర్ 6వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్కు రూ.275, బ్రిడ్జికోర్సు సబ్జెక్టుకు రూ.165 చొప్పున చెల్లించాలని బోర్డు సూచించింది. కాగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 23, 2025వ నుంచి మార్చి 23 వరకు జరగనున్నాయి.