Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zee Shares: రూ.2000 కోట్ల అవకతవకలు.. జీకి భారీ షాక్.. షేర్లు ఢమాల్‌!

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (ZEEL) సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. జీ ఖాతాల నుంచి సుమారు రూ. 2,000 కోట్ల నిధులను 'మళ్లించిన'ట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గుర్తించినట్లు వచ్చిన వార్తలను బుధవారం తోసిపుచ్చింది. దీని కారణంగా బుధవారం మిడ్ సెషన్ ట్రేడింగ్‌లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ( జీఈఎల్ ) షేర్లు.

Zee Shares: రూ.2000 కోట్ల అవకతవకలు.. జీకి భారీ షాక్.. షేర్లు ఢమాల్‌!
Zee Shares
Follow us
Subhash Goud

|

Updated on: Feb 21, 2024 | 4:55 PM

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (ZEEL) సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. జీ ఖాతాల నుంచి సుమారు రూ. 2,000 కోట్ల నిధులను ‘మళ్లించిన’ట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గుర్తించినట్లు వచ్చిన వార్తలను బుధవారం తోసిపుచ్చింది. దీని కారణంగా బుధవారం మిడ్ సెషన్ ట్రేడింగ్‌లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ( జీఈఎల్ ) షేర్లు 12% గణనీయమైన పతనాన్ని చవిచూశాయి. అంతేకాకుండా రెండు ఎక్స్ఛేంజీలలో స్టాక్ దాని లోయర్ సర్క్యూట్ పరిమితిని తాకింది. దీనికి విరుద్ధంగా BSE సెన్సెక్స్ బెంచ్‌మార్క్ 90.17 పాయింట్లు (0.12%) పెరిగి 73,147.57 వద్దకు చేరుకుంది. అలాగే NSE నిఫ్టీ 40.25 పాయింట్లు పెరిగి 22,237.20కి చేరుకుంది.

వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. “జీలో అకౌంటింగ్ సమస్యలకు సంబంధించిన నివేదికలు, వచ్చిన పుకార్లు వాస్తవం కాదని కంపెనీ పేర్కొంది. అయితే సెబి అభ్యర్థించిన వివరాలను అందించే పనిలో ఉన్నామని తెలిపింది. అన్ని అంశాలపై పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపింది. కంపెనీలో దాదాపు $240 మిలియన్ల (దాదాపు రూ. 2000 కోట్లు) నిధుల మళ్లింపు జరిగినట్లు రెగ్యులేటర్ సెబీ తన దర్యాప్తులో వెల్లడించింది. వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ నివేదికను ఉటంకిస్తూ ఈ సమాచారం బయటకు వచ్చింది. నివేదిక ప్రకారం, జీ ఫౌండర్స్ దర్యాప్తులో ఈ కంపెనీ నుండి భారీ నిధులు మళ్లించబడినట్లు సెబీ గుర్తించింది. అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే, సెబీ దర్యాప్తు ప్రారంభించినప్పుడు, ఇంత భారీ మొత్తాన్ని ఊహించలేదు. సెబీ అంచనాతో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 10 రెట్లు. అయితే, ఈ సమాచారం బ్లూమ్‌బెర్గ్ నివేదిక నుండి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించి సెబీ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. సెబీ దర్యాప్తులో ఇంత భారీ నిధుల మళ్లింపు నిజమైతే జీ(zee) సీఈవో పునీత్ గోయెంకా కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఈఈ) ఖాతాల్లో రూ. 2,000 కోట్ల దుర్వినియోగం జరిగిందన్న నివేదికల నేపథ్యంలో బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో షేర్లు 12 శాతానికి పైగా పడిపోయాయి. గత 1 సంవత్సరంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు 30% కంటే ఎక్కువ పడిపోయాయి. సోనీ గ్రూప్ కార్ప్ ఇండియా యూనిట్‌తో విలీన ఒప్పందం కుప్పకూలిన తర్వాత జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు ఇటీవల బాగా క్షీణించాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు వార్షిక ప్రాతిపదికన 30 శాతానికి పైగా క్షీణించాయి. ఇదే సమయంలో గత ఆరు నెలల్లో కంపెనీ షేర్లు 36.11 శాతం క్షీణించాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ (జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ షేర్) షేర్లు ఉదయం 10:34 గంటలకు 10.52 శాతం లేదా రూ. 20.30 తగ్గి రూ.172.70 వద్ద ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి