ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. పెరిగిన పైసలు, పనిదినాలు.. ఎంతంటే..?

MNREGA: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజనగా మారింది. పని దినాలతో పాటు రోజువారీ వేతనాన్ని సైతం కేంద్రం పెంచింది. ఈ పథకం కోసం కేంద్రం రూ.1.51 లక్షల కోట్లు కేటాయించింది. ఇది గ్రామీణ కార్మికులకు ఆర్థిక భద్రతను, జీవనోపాధిని పెంచుతుంది.

ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. పెరిగిన పైసలు, పనిదినాలు.. ఎంతంటే..?
Mgnrega Work Days And Wages Increased

Updated on: Dec 13, 2025 | 11:37 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పథకం పేరును మార్చడంతో పాటు పని దినాల సంఖ్యను, కనీస వేతనాన్ని పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ఈ బిల్లు ప్రకారం.. ఉపాధి హామీ పథకంలో మూడు ప్రధాన మార్పులు జరిగాయి. ఉపాధి హామీ పథకం పేరును అధికారికంగా పూజ్య బాపు గ్రామీణ రోజుగార్ యోజనగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను పెంచేందుకు, ఈ పథకం కింద హామీ ఇచ్చే పని దినాల సంఖ్యను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచారు. గ్రామీణ కార్మికులకు మరింత ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రోజువారీ కనీస వేతనాన్ని రూ. 240కి సవరించారు. ఇక ఈ పూజ్య గ్రామీణ రోజ్‌గార్ యోజన కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1.51 లక్షల కోట్లు కేటాయించింది.

పథకం నేపథ్యం – ప్రయోజనాలు

ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల జీవనోపాధి భద్రతను పెంచడం. ముఖ్యంగా వ్యవసాయం తక్కువగా ఉండే సమయంలో ఈ పథకం కోట్లాది మంది గ్రామీణ కార్మికులకు ఆర్థికంగా మద్దతు ఇస్తుంది. ఈ పథకం 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ద్వారా NREGA పేరుతో ప్రారంభించారు. గ్రామీణ రోడ్లు, చెరువులు తవ్వకం, నీటి సంరక్షణ, కాలువలు సృష్టించడం వంటి మౌలిక సదుపాయాల పనులను ఈ పథకం కింద చేపడతారు. గ్రామీణ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం, నగరాలకు వలసలను తగ్గించడం, గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us