Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం కూడా వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.63,200లుగా ఉంది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ.63,200 వద్ద కొనసాగుతోంది. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,200 లుగా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 66,600లుగా ఉంది. * బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.63,200 గా కొనసాగుతోంది. * కోల్కతాలో కిలో వెండి ధర రూ.63,200 లుగా ఉంది. * కేరళలో కిలో వెండి ధర రూ.66,600గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో.. * హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.66,600 లుగా కొనసాగుతోంది. * విజయవాడలో వెండి ధర రూ. 66,600 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.66,600 లుగా ఉంది.
కాగా.. ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: