AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. కనిష్ఠస్థాయికి పడిపోయిన ఎల్‌ఐసీ షేర్లు..

భారతీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిసింది. సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 93 పాయింట్లు తగ్గి 55,675 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్లు తగ్గి 15,569 వద్ద స్థిరపడింది...

Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. కనిష్ఠస్థాయికి పడిపోయిన ఎల్‌ఐసీ షేర్లు..
Stock Market
Srinivas Chekkilla
|

Updated on: Jun 06, 2022 | 3:57 PM

Share

భారతీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిసింది. సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 93 పాయింట్లు తగ్గి 55,675 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్లు తగ్గి 15,569 వద్ద స్థిరపడింది. పెట్టుబడిదారులు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందన్న భయంతో జాగ్రత్త పడ్డారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌ ఈ రోజు ప్రారంభమైంది. ఈ మీటింగ్‌ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC) షేర్లు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. మిడ్ క్యాప్‌ 0.11 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1.02 శాతం పడిపోయాయి.

సబ్‌ ఇండెక్స్‌ల్లో నిఫ్టీ కాన్సుమర్‌ డ్యూరబుల్స్‌ 0.58 శాతం నష్పోయింది. శ్రీ సిమెంట్‌ నిఫ్టీ టాప్‌ లూసర్‌గా నిలిచింది. ఈ స్టాక్‌ 3.14 శాతం పడిపోయిర రూ.19,990 వద్ద ముగిసింది. బీపీసీఎల్, ఏసియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్, హీరో మోటోకార్ప్‌ నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఏసియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్ సిమెంట్, బాజాజ్‌ ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా, ఎల్‌ఆండ్టీ, హిందుస్థాన్‌ యూనిలివర్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ ఫార్మా, డా. రెడ్డీస్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ఎల్‌ఐసీ నష్టాల్లో స్థిరపడ్డాయి. టాటా స్టీల్‌, ఇండస్‌లాండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్ఎం, ఐటీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్టీపీసీ లాభాల్లో ముగిశాయి.