AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Life: మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారా.? ఈ పాలసీలపై ఓ లుక్కేయండి..

ప్రస్తుత రోజుల్లో ద్రవ్యోల్బణం ఓ రేంజ్‌లో పెరుగుతోంది. ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది పొదుపు మంత్రం పాటిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొంత మొత్తాన్ని దాచాలనే దృక్పథం అందరిలోనూ పెరిగిపోతోంది. ముఖ్యంగా పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు..

SBI Life: మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారా.? ఈ పాలసీలపై ఓ లుక్కేయండి..
Sbi Life
Narender Vaitla
|

Updated on: Dec 09, 2022 | 10:34 AM

Share

ప్రస్తుత రోజుల్లో ద్రవ్యోల్బణం ఓ రేంజ్‌లో పెరుగుతోంది. ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది పొదుపు మంత్రం పాటిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొంత మొత్తాన్ని దాచాలనే దృక్పథం అందరిలోనూ పెరిగిపోతోంది. ముఖ్యంగా పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు ముందు నుంచే డబ్బును దాచుకుంటున్నారు. పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే డబ్బులు జమ చేయడం ఒక్కటనే మార్గమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రెండు పథకాలను తీసుకొచ్చింది. ఎస్‌బీఐ లైప్‌ స్మార్ట్‌ స్కాలర్‌, ఎస్‌బీఐ లైఫ్‌ స్మార్ట్‌ చాంప్‌ అనే రెండు పథకాలను అందుబాటులోకి తెచ్చింది.

SBI లైఫ్- స్మార్ట్ చాంప్ ఇన్సూరెన్స్..

ఈ పథకం ద్వారా నెలవారీ, త్రైమాసికం, హాఫ్‌ ఇయర్‌, ఇయర్లీగా పెట్టుబడి పెట్టొచ్చు. 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వారెవరైనా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయొచ్చు. అయితే పిల్లల వయసు మాత్రం 0 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పాలసీ మెచ్యూరిటీ కాల వ్యవధి 21 ఏళ్లుగా ఉంటుంది. బిడ్డకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని 4 వార్షిక వాయిదాల్లో తీసుకొవచ్చు. అంటే 18 నుంచి 21 ఏళ్ల వయసు వచ్చే వరకు ప్రతీ ఏటా 25 శాతం చొప్పున తీసుకొవచ్చన్నమాట. ఈ పథకం ద్వారా డబ్బు జమ చేసుకోవడంతో పాటు బీమా ప్రయోజనం కూడా లభిస్తుంది. అనుకోనిది ఏదైనా జరిగితే ప్లాన్‌ కింద హామీ మొత్తంలో 100 శాతం వరకు బీమాగా పొందొచ్చు.

ఎస్‌బీఐ స్మార్ట్ స్కాలర్‌..

ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలంటే తల్లిదండ్రులు 18 నుంచి 57 ఏళ్ల కలిగి ఉండాలి. అలాగే పిల్లలు 0 నుంచి 17 ఏళ్ల మధ్య ఉండాలి. పాలసీలో కనీసం 8 ఏళ్ల గరిష్టంగా 25 ఏళ్ల వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. ఇక ఈ పాలసీ 18 నుంచి 25 ఏళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్‌ ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు 65 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ పొందుతుంది. ఈ పాలసీలో చేరిన వారు అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా పాలసీ దారలకు బీమా కూడా వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..