Samsung: శామ్‌సంగ్‌ ఫోన్‌ కొనాలకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.. ఆ ఫోన్లు ఇక అమ్మరా..!

Samsung భారతదేశంలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటి. ఇది ఫీచర్ ఫోన్‌(Future Phone)ల మార్కెట్‌లో ప్రజాదరణ పొందింది...

Samsung: శామ్‌సంగ్‌ ఫోన్‌ కొనాలకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.. ఆ ఫోన్లు ఇక అమ్మరా..!
Samsung
Follow us

| Edited By: Ayyappa Mamidi

Updated on: May 26, 2022 | 2:02 PM

Samsung భారతదేశంలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటి. ఇది ఫీచర్ ఫోన్‌(Future Phone)ల మార్కెట్‌లో ప్రజాదరణ పొందింది. దక్షిణ కొరియా చెందిన ఈ దిగ్గజ కంపెనీ తక్కువ-విలువ ఫీచర్ ఫోన్ మార్కెట్ నుంచి నిష్క్రమించాలని భావిస్తోంది. కంపెనీ రూ 15,000 కంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడంపై దృష్టి సారించనుంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, భారత ప్రభుత్వ ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (PLI) పథకానికి సహకరిస్తున్న రెండు ప్రధాన బహుళజాతి కంపెనీలలో Samsung ఒకటి. గ్లోబల్ ద్రవ్యోల్బణం, విడిభాగాల కొరతతో, స్మార్ట్‌ఫోన్‌ల ధరలు గత కొన్ని నెలలుగా పెరిగాయి. సామ్‌సంగ్ తయారీ భాగస్వామి అయిన డిక్సన్ తక్కువ-ధర ఫోన్‌లను తయారు చేయడం మానేసే అవకాశం ఉండడం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. అయితే ఫీచర్ ఫోన్‌ల ఉత్పత్తి ఈ ఏడాది చివరి నాటికి ఆగిపోతుందా లేదా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా తయారీ లైన్ల నుంచి క్రమంగా నిలిపివేస్తార అనేది స్పష్టత లేదు.

అమ్మకాలు తగ్గడంతో ధర ఫీచర్ ఫోన్ మార్కెట్ నుంచి నిష్క్రమించాలనే శామ్‌సంగ్ ప్లాన్ చేస్తుంది. 2022 మొదటి త్రైమాసికంలో ఫీచర్ ఫోన్ మార్కెట్ సంవత్సరానికి 39 శాతం క్షీణతను చూస్తోంది. సరఫరా సంక్షోభం, అధిక ఇన్వెంటరీ స్థాయిలు, రిటైల్ ద్రవ్యోల్బణం కారణంగా వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. ఒకప్పుడు ఫీచర్ ఫోన్ మార్కెట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రగామిగా నిలిచిన శామ్‌సంగ్, మార్చి చివరి నాటికి కేవలం 12 శాతం మార్కెట్ వాటాతో 3వ స్థానానికి పడిపోయింది. ఇది ఐటెల్ కంటే చాలా వెనుకబడి ఉంది. మార్చి చివరి నాటికి Samsung ఫీచర్ ఫోన్ వ్యాపారం మొత్తం విలువలో 1 శాతం మాత్రమే. అయితే ఫీచర్ ఫోన్ షిప్‌మెంట్‌లు మొత్తం వాల్యూమ్‌లో 20 శాతం ఉన్నాయి. విక్రయాలు షిప్‌మెంట్‌లు తగ్గుముఖం పట్టడంతో నిష్కక్రమించాలని చూస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..