AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retail inflation: పెట్రోల్‌, డీజిల్‌ ధర తగ్గింపుతో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

ద్రవ్యోల్బణం(Inflation) పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్(petrol), డీజిల్‌(Diesel)పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 తగ్గిస్తూ ప్రజలకు ఉపశమనం కలిగించింది...

Retail inflation: పెట్రోల్‌, డీజిల్‌ ధర తగ్గింపుతో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Inflation
Srinivas Chekkilla
|

Updated on: May 23, 2022 | 9:41 AM

Share

ద్రవ్యోల్బణం(Inflation) పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్(petrol), డీజిల్‌(Diesel)పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 తగ్గిస్తూ ప్రజలకు ఉపశమనం కలిగించింది. దీని వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 0.40 శాతం వరకు తగ్గవచ్చని అభిప్రాయపడింది. ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గనుంది. రాష్ట్రాలు వ్యాట్‌ని తగ్గించడం వల్ల ధర మరింత తగ్గే అవకాశం ఉంది. గత నాలుగు నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతంగా ఉంది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి. మే నెలలో రిజర్వ్ బ్యాంక్ అకస్మాత్తుగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. ఆ తర్వాత రెపో రేటు 4.4 శాతానికి పెరిగింది. ఇంధన పన్నును తగ్గించాలని ద్రవ్య విధాన కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదికలో ద్రవ్యోల్బణం 0.40 శాతం తగ్గవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త మదన్ సబ్నివాస్ తెలిపారు.

పెట్రోలియంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పాటు, స్టీల్, ప్లాస్టిక్ ఉత్పత్తులపై కూడా కస్టమ్ సుంకం తగ్గించారు. దీంతో సిమెంట్ లభ్యత పెరిగి ధర తగ్గుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ప్రభావం సెప్టెంబర్ త్రైమాసికంలో అంటే జూన్-సెప్టెంబర్‌లో కనిపిస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డైరెక్ట్ అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్లు, క్వాంట్ ఎకో డైరెక్ట్ 25 బేసిస్ పాయింట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ 30-35 బేసిస్ పాయింట్లు, నోమురా 0.30 శాతం నుంచి 0.40 శాతం అంచనా వేసింది. మే నెలలో ద్రవ్యోల్బణం రేటు 6.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉండవచ్చని ICRA అంచనా వేసింది.

మే నెలకు ఇంకా 10 రోజులు కూడా సమయం లేదని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ సాక్షి గుప్తా చెప్పారు. అటువంటి పరిస్థితిలో ఇటీవలి నిర్ణయం ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రభావం జూన్ నెలలో కనిపించే అవకాశం ఉంది. డ్యూటీ తగ్గింపుతో పాటు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచడం కూడా ద్రవ్యోల్బణం తగ్గింపుపై ప్రభావం చూపుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…