Jio 5G Smartphone: “కేవలం రూ.2500కే జియో 5జీ ఫోన్..?”భలే మంచి చౌక బేరము..! లాంచింగ్ ఎప్పుడో తెలుసా..!

|

Jun 03, 2021 | 2:09 PM

Reliance 5G Smartphone: రిలయన్స్ మరో బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. రిలయన్స్ జియో మరో సంచలనానికి రెడీ అవుతోంది. అత్యంత చౌక ధరకే 5జీ ఫోన్‌ను తీసుకువచ్చే ప్లాన్ చేస్తోంది .

Jio 5G Smartphone: కేవలం రూ.2500కే జియో 5జీ ఫోన్..?భలే మంచి చౌక బేరము..! లాంచింగ్ ఎప్పుడో తెలుసా..!
Reliance 5g Smartphone
Follow us on

రిలయన్స్ మరో బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. రిలయన్స్ జియో మరో సంచలనానికి రెడీ అవుతోంది. అత్యంత చౌక ధరకే 5జీ ఫోన్‌ను తీసుకువచ్చే ప్లాన్ చేస్తోంది. ఈ నెల 24న జరిగే వార్షిక వాటాదారుల సమావేశంలో రిలయన్స్ జియో 5జీ లాంఛ్ అవుతుందని తెలుస్తోంది. దీంతో మరింత మంది యూజర్లకు చేరువ కావాలని యోచిస్తోంది. రిలయన్స్ జియో రూ.5,000 కన్నా తక్కువ ధరకే 5జీ ఫోన్ తీసుకువచ్చేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత ఈ ధరను రూ.2,500- రూ.3,000 వరకు ధరను తగ్గించాలని రిలయన్స్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయిస్తారని తెలస్తోంది. కంపెనీ ప్రస్తుతం 2జీ ఫోన్ వాడుతున్న వారు టార్గెట్‌గా ఈ 5జీ ఫోన్ తీసుకురాబోతోంది.  20- 30 కోట్ల మంది యూజర్లు టార్గెట్‌గా జియో తన 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది.

ప్రస్తుతం భారత దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధర రూ.27,000 నుంచి ప్రారంభమౌతోంది. అంతేకాకుండా ఇటీవల యూజర్లలో 5జీ ఫోన్లపై అవగాహన మరింత పెరిగింది. నెట్‌వర్క్ వినియోగం కూడ పెరగడంతో 5జీ కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా రోజు రోజు కు పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి : CBSE 12 Results 2021: సీబీఎస్ఈ 12 ఫలితాలు ఎలా నిర్ణయిస్తారు? నిపుణులు ఈ విషయంలో ఏం సూచిస్తున్నారు?