Realestate: రియల్ ఎస్టేట్ దిగ్గజాల్లో టాప్ 100లో 10మంది తెలుగోళ్లే

రియల్ ఎస్టేట్ రంగంలో తెలుగు రాష్ట్రాల హవా గట్టిగానే ఉంది. దేశంలోని 100 మంది సంపన్న రియాల్టీ దిగ్గజాల్లో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. 2023కి గాను దేశీ రియల్టీ కుబేరులతో కిచెన్, బాత్రూమ్‌ ఫిట్టింగ్స్‌ సంస్థ గ్రోహె, రీసెర్చ్‌ సంస్థ హురున్‌..

Realestate: రియల్ ఎస్టేట్ దిగ్గజాల్లో టాప్ 100లో 10మంది తెలుగోళ్లే
Realestate

Updated on: May 30, 2023 | 1:28 PM

రియల్ ఎస్టేట్ రంగంలో తెలుగు రాష్ట్రాల హవా గట్టిగానే ఉంది. దేశంలోని 100 మంది సంపన్న రియాల్టీ దిగ్గజాల్లో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. 2023కి గాను దేశీ రియల్టీ కుబేరులతో కిచెన్, బాత్రూమ్‌ ఫిట్టింగ్స్‌ సంస్థ గ్రోహె, రీసెర్చ్‌ సంస్థ హురున్‌ ఇండియా సంయుక్తంగా తీసుకువచ్చిన ఒక లిస్ట్ లో ఈ విషయం వెల్లడైంది. రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ రాజీవ్‌ సింగ్‌ అత్యంత సంపన్నుడిగా ఆ లిస్ట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రూ. 59,030 కోట్ల సంపదతో ఆయన మరోసారి నంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. 16 నగరాలకు చెందిన 67 కంపెనీలకు సంబంధించి 100 మంది సంపన్నులకు ర్యాంకింగ్‌ ఇచ్చారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది చోటు దక్కింది.

ఇటీవల విడుదల చేసిన సంపన్నుల జాబితా ప్రకారం.. రూ. 42,270 కోట్ల సంపదతో మంగళ్‌ ప్రభాత్‌ లోధా కుటుంబం రెండో స్థానంలో, రూ. 37,000 కోట్ల సంపదతో ఆర్‌ఎంజెడ్‌ కార్ప్‌ అర్జున్‌ మెండా కుటుంబం మూడో స్థానంలో ఉన్నాయి. ఈసారి లిస్టులో 25 మందికి కొత్తగా చోటు దొరికింది. అదేవిధంగా గతంలో ఈ లిస్టులో ఉన్నవారిలో 36 మంది సంపద తగ్గింది.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే కనుక.. మహారాష్ట్రలో అత్యధికంగా 37 మంది రియల్టీ కుబేరులు ఉన్నారు. అలాగే ఢిల్లీలో 23 మంది, కర్ణాటకంలో 18 మంది ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణాలో 9 మంది, ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కరూ ఈ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. నగరాల పరంగా 29 మందితో ముంబయి అగ్రస్థానంలో ఉండగా ఢిల్లీ.. బెంగళూరు తరువాత స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అలాగే 2017లో టాప్‌ 10లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద రూ.3,350 కోట్లుగా ఉంది. అది ప్రస్తుతం రూ.15,000 కోట్లకు చేరుకుంది. అలాగే టాప్‌ 50లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద రూ. 660 కోట్ల నుంచి రూ.1,330 కోట్లకు చేరింది. టాప్‌ 100 మంది రియాల్టీ దిగ్గజాల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 4% పెరిగి రూ.4,72,330 కోట్లుగా ఉంది. ఇందులో టాప్‌ 10 కుబేరుల వాటా 60%గా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ లిస్టు లో చోటు సంపాదించుకున్న పది మంది వీరే.

గవ్వా అమరేందర్‌ రెడ్డి కుటుంబం, జీఏఆర్‌ రూ.15,000 కోట్లతో 10లో ఉన్నారు. జూపల్లి రామేశ్వర రావు కుటుంబం (మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌) రూ. 9,490 కోట్లతో 13వ ర్యాంకులో ఉన్నారు. సి. వెంకటేశ్వర రెడ్డి, (అపర్ధ) రూ. 5,940 కోట్లతో 16వ ర్యాంకు, ఎస్‌ సుబ్రమణ్యం రెడ్డి (అపర్థ కన్‌స్ట్రక్షన్స్‌) రూ. 5,880 కోట్లతో 17వ ర్యాంకు, మనోజ్‌ నంబూరు (అలయన్స్‌ ఇన్‌ఫ్రా) రూ. 3,900 కోట్లతో 29వ ర్యాంకు, అయోధ్య రామిరెడ్డి (రామ్‌కీ ఎస్టేట్స్‌) రూ. 1,420 కోట్లతో 46వ ర్యాంకు, సునీల్‌ బొమ్మిరెడ్డి (అలయన్స్‌ ఇన్‌ఫ్రా) రూ. 1,300 కోట్లతో 49వ ర్యాంకు, సురేంద్ర బొమ్మిరెడ్డి (అలయన్స్‌ ఇన్‌ఫ్రా) రూ. 1,300 కోట్లతో 49వ ర్యాంకు, సురేశ్‌ బొమ్మిరెడ్డి (అలయన్స్‌ ఇన్‌ఫ్రా) రూ.1,300 కోట్లతో 49వ ర్యాంకు, జీవీకే రెడ్డి, కుటుంబం (తాజ్‌ జీవీకే హోటల్స్‌) రూ. 700 కోట్లతో 78వ ర్యాంకు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి