Post Office: ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా? ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే ఐదేళ్లలో రూ.12 లక్షల వడ్డీ..!

ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. మంచి అవగాహన ఉండి వివిధ పథకాలలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడి పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. పోస్టాఫీసులో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ డిపాజిట్‌తో ఎక్కువ వడ్డీ రాబట్టుకోవచ్చు..

Post Office: ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా? ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే ఐదేళ్లలో రూ.12 లక్షల వడ్డీ..!
Follow us

|

Updated on: Oct 26, 2024 | 9:08 PM

గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. చాలా మంది పెట్టుబడిదారులు గత 6 నెలలు లేదా 1 సంవత్సరంలో సంపాదించిన దాన్ని కోల్పోయారని చెబుతున్నారు. గత నెల రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.40 లక్షల కోట్ల మేర నష్టపోయారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఇప్పుడు తక్కువ రిస్క్ ఉన్న ప్రదేశాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఇలాంటి పథకంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, లక్షల రూపాయలు సంపాదించగల ప్రభుత్వ పథకం గురించి తెలుసుకుందాం.

ఈ పథకం చిన్న పొదుపు పథకాలకు లింకై ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్ కింద నిర్వహిస్తున్నారు. ఈ పథకం కింద కేవలం వడ్డీ ద్వారానే రూ.12 లక్షలకు పైగా ఆదాయం లభిస్తుంది. అలాగే రిస్క్‌ చాలా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఈ పథకం కింద పన్ను ప్రయోజనం ప్రయోజనం కూడా ఉంటుంది. ఇందులో పెట్టుబడి గరిష్ట పరిమితి రూ.30 లక్షలు. సీనియర్ సిటిజన్ ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి మాట్లాడినట్లయితే.. దీని కింద మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఎలాగో తెలుసుకుందాం?

ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: వామ్మో ఇంత టెక్నాలజీనా..? వందే భారత్‌ స్లీపర్‌ రైలు ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే షాకవుతారు!

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది డిపాజిట్ స్కీమ్‌. ఇందులో 5 సంవత్సరాల పాటు నిర్ణీత మొత్తం పెట్టుబడి పెడతారు. సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పెట్టుబడి పరిమితి రూ.1000. ప్రస్తుతం ఈ పథకంపై 8.2 శాతం వార్షిక వడ్డీ ఉంటుంది. అయితే, వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తుంటారు.

రూ. 12 లక్షలపై వడ్డీని ఎలా పొందవచ్చు?

మీరు ఈ పథకంలో సంవత్సరానికి రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాలలో 8.2% చొప్పున రూ.12,30,000 వడ్డీని పొందుతారు. ప్రతి త్రైమాసికానికి రూ.61,500 వడ్డీ జమ అవుతుంది. అటువంటి పరిస్థితిలో 5 సంవత్సరాల తర్వాత మీరు మెచ్యూరిటీ మొత్తంగా రూ. 42 లక్షల 30 వేలు పొందుతారు.

మీరు ఈ పథకంలో 5 సంవత్సరాల పాటు రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే, ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతం ప్రకారం, మీకు వడ్డీ నుండి మాత్రమే 5 సంవత్సరాలలో రూ. 6 లక్షల 15 వేలు పొందుతారు. త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తే, ప్రతి మూడు నెలలకు రూ.30,750 వడ్డీ అందుతుంది. ఈ విధంగా రూ.15 లక్షలు, వడ్డీ మొత్తం కలిపి మొత్తం రూ.21 లక్షల 15 వేలు మెచ్యూరిటీ మొత్తంగా అందుతుంది.

ఇది కూడా చదవండి: TV Tariff Plan: టీవీ ఛానళ్లు చూసేవారికి షాకింగ్‌.. పెరగనున్న ధరలు.. ప్రభుత్వం కొత్త నిబంధనలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!