PMSBY Scheme: సంవత్సరానికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ఇన్సూరెన్స్‌.. మోడీ ప్రభుత్వం నుంచి అద్భుతమైన పథకం

|

May 30, 2023 | 5:30 AM

దేశంలో మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. వివిధ రకాల డిపాజిట్‌ పథకాలతో పాటు ఇన్సూరెన్స్‌ పథకాలను సైతం ప్రవేశపెడుతోంది. ఇక మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) ఒకటి. ఈ పాలసీ..

PMSBY Scheme: సంవత్సరానికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ఇన్సూరెన్స్‌.. మోడీ ప్రభుత్వం నుంచి అద్భుతమైన పథకం
Pmsby Scheme
Follow us on

దేశంలో మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. వివిధ రకాల డిపాజిట్‌ పథకాలతో పాటు ఇన్సూరెన్స్‌ పథకాలను సైతం ప్రవేశపెడుతోంది. ఇక మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) ఒకటి. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఈ ప్రధాన్‌ మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్‌లో సంవత్సరానికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. సురక్ష బీమా యోజన అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇందులో చేరాలంటే బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీమా పాలసీ తీసుకుంటే పాలసీదారులు ఆటో డెబిట్‌ ఆప్షన్‌ పెట్టుకుంటే వారి అకౌంట్‌ నుంచి ప్రతి ఏడాది రూ.20 ఖాతా నుంచి నేరుగా కట్‌ అవుతాయి.

సురక్ష బీమా యోజన స్కీమ్‌లో ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబాలకు రూ.2 లక్షల వరకు డబ్బులు లభిస్తాయి. అదే పాక్షికంగా అంగ వైకల్యం సంభవిస్తే రూ.1 లక్ష వరకు వస్తాయి. శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.2 లక్షలు లభిస్తాయి. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఈ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా స్కీమ్‌లో చేరవచ్చు.

ఇవి కూడా చదవండి

మీకు దగ్గరిలో ఉన్న బ్యాంక్‌కు వెళ్లి అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచుకు వెళ్లి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా స్కీమ్‌లో చేరవచ్చు. ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలి. 70 ఏళ్లు దాటితే ఈ స్కీమ్ వర్తించదు. అలాగే ఎలాంటి డబ్బులు కూడా లభించవు. ఈ పాలసీ జూన్ 1 నుంచి మే 31 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం మే 31కి ముందు ప్రీమియం మొత్తం బ్యాంకు ఖాతా నుంచి ఆటో డిడక్ట్‌ చేయబడుతుంది. ఒక వేళ ఖాతా మూసివేయబడితే పాలసీ రద్దు అవుతుందని గుర్తించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి