PM Kisan Yojana: పీఎం కిసాన్‌ స్కీమ్‌లో గోల్‌మాల్‌.. 21 లక్షల మంది అనర్హులుగా గుర్తింపు

PM Kisan Yojana: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ గురించి అందరికి తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది రైతులు లాభం పొందుతున్నారు. ఈ పథకానికి ప్రధాని..

PM Kisan Yojana: పీఎం కిసాన్‌ స్కీమ్‌లో గోల్‌మాల్‌.. 21 లక్షల మంది అనర్హులుగా గుర్తింపు
Pm Kisan Scheme
Follow us

|

Updated on: Sep 08, 2022 | 8:11 AM

PM Kisan Yojana: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ గురించి అందరికి తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది రైతులు లాభం పొందుతున్నారు. ఈ పథకానికి ప్రధాని నరేంద్ర మోడీ యూపీలో 24 ఫిబ్రవరి 2019న పీఎం కిసాన్‌ స్కీమ్‌ను ప్రారంభించారు. అయితే ఈ పీఎం కిసాన్‌ స్కీమ్‌ వచ్చాక కొన్ని రాష్ట్రాల్లో అనర్హులు కూడా డబ్బులు పొందుతుండగా, కేంద్రం నిఘా పెట్టింది. దీంతో అనర్హులను ఏరివేసే కార్యక్రమం చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంలో రాష్ట్రంలో 21 లక్షల మంది అనర్హులుగా గుర్తించింది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. ఇప్పటికే అక్కడ ఎంతో మంది అనర్హులుగా గుర్తించగా, ఇంకా ఏరివేత కార్యక్రమం చేపడుతూనే ఉంది.

ఈ పథకం ద్వారా పొందిన సొమ్మును తిరిగి రాబట్టే పనిలో ఉన్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్‌ షాహి వెల్లడించారు. యూపీలో 2.85 కోట్ల మంది రైతులు ఉండగా, అందులో 21 లక్షల మంది అనర్హులగా తేల్చింది ప్రభుత్వం. ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరు, ఆదాయపు పన్ను కట్టేవారు ఈ పీఎం కిసాన్‌ స్కీమ్‌ ద్వారా డబ్బులు అందుకున్న వారిలో ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు వారు పొందిన మొత్తాన్ని రికవరీ చేస్తామని ఆయన వెల్లడించారు.

కాగా, రైతులకు పెట్టుబడి సాయంగా ఉండేందుకు ఈ పీఎం కిసాన్‌ స్కీమ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున అందిస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతల్లో అంటే రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. అనర్హులు పొందిన ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ప్రత్యేక సదుపాయాన్ని సైతం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?