AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. 2వేలు జమ కావాలంటే ఇవి తప్పనిసరి..

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే శుభవార్త అందనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అందించే 24వ విడత రూ. 2,000 పెట్టుబడి సాయం కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 23వ విడత నిధులు జూన్‌లో విడుదల కాగా నాలుగు నెలల గడువు ప్రకారం 24వ విడత సొమ్ము ఎప్పుడు జమ కానుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. 2వేలు జమ కావాలంటే ఇవి తప్పనిసరి..
Pm Kisan 24th Installment Release Date
Krishna S
|

Updated on: Aug 29, 2026 | 2:16 PM

Share

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు సాగు ఖర్చుల కోసం పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అతిపెద్ద సంక్షేమ పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అత్యంత ముఖ్యమైనది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం ఏడాదికి మొత్తం రూ.6,000 ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. ప్రతి నాలుగు నెలలకు ఒక విడత చొప్పున రూ. 2,000 లెక్కిస్తూ ఏడాదికి మూడు సమాన విడతల్లో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తుంది. ఇప్పటికే వరుసగా నిధులను విడుదల చేస్తూ వస్తున్న కేంద్రం, తాజాగా 24వ విడత చెల్లింపులకు సిద్ధమవుతుండటంతో దేశవ్యాప్తంగా రైతులు ఈ నగదు జమ ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

24వ విడత నిధులు ఎప్పుడు విడుదల కానున్నాయి?

పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక విడత నిధులు విడుదలవుతాయి. పథకంలో భాగంగా 23వ విడత నిధులను జూన్ నెలలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆ లెక్కన నాలుగు నెలల కాలపరిమితి అక్టోబర్ నాటికి పూర్తవుతుంది. కాబట్టి 24వ విడత నిధులు సెప్టెంబర్‌లో కాకుండా అక్టోబర్ నెలలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఖచ్చితమైన విడుదల తేదీపై కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

రైతులు చేయాల్సిన 3 తప్పనిసరి పనులు

24వ విడత రూ. 2,000 మీ ఖాతాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా జమ కావాలంటే ఈ కింది పనులను వెంటనే పూర్తి చేసుకోవడం ముఖ్యం..

ఈ-కేవైసీ: పీఎం కిసాన్ పోర్టల్ pmkisan.gov.in లేదా సమీపంలోని సీఎస్‌సీ కేంద్రం ద్వారా బయోమెట్రిక్, ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

భూ రికార్డుల ధృవీకరణ: సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ శాఖ ద్వారా మీ భూమి రికార్డుల ధృవీకరణ పూర్తయిందా లేదా అని పోర్టల్ స్టేటస్‌లో చూసుకోవాలి.

బ్యాంక్ ఖాతా అనుసంధానం: ప్రభుత్వ సాయం నేరుగా డీబీటీ ద్వారా అందుతుంది కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం అయి ఉండటంతో పాటు NPCI సర్వర్‌కు మ్యాప్ అయి యాక్టివ్‌గా ఉండాలి.

కాగా ఈ అర్హతలన్నీ సరిగ్గా ఉన్న రైతులకు మాత్రమే అక్టోబర్‌లో విడుదలయ్యే 24వ విడత నిధులు క్రమం తప్పకుండా ఖాతాల్లో జమ కానున్నాయి.

Follow Us