AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వేల ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో కీలక మార్పులు..

Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో అనేక మార్పులు రానున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని పార్లమెంట్ కమిటీకి అందజేసింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్..

Indian Railways: రైల్వేల ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో కీలక మార్పులు..
Subhash Goud
|

Updated on: Aug 13, 2022 | 11:44 AM

Share

Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో అనేక మార్పులు రానున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని పార్లమెంట్ కమిటీకి అందజేసింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రస్తుతం ఉన్న పీఆర్‌ఎస్ వ్యవస్థపై అధ్యయనం చేస్తోంది. రైల్వే అప్‌గ్రేడేషన్‌కు సూచనలు అందించడానికి ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌ని నియమించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ నేతృత్వంలోని రైల్వే స్టాండింగ్ కమిటీ ‘భారతీయ రైల్వేల ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్’ పేరుతో నివేదికను పార్లమెంట్‌లో సమర్పించింది. ఈ నివేదికలో, 2019-20 సంవత్సరంలో IRCTC వెబ్‌సైట్/యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసిన టిక్కెట్లు రిజర్వేషన్ సెంటర్ సైట్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్‌ల కంటే 3 రెట్లు ఎక్కువ అని కమిటీ తెలిపింది. అయితే ఈ వెబ్‌సైట్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో దీని ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ -టికెటింగ్ సౌకర్యం ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా రైల్వే కౌంటర్లలో రద్దీని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని కమిటీ సూచించింది. దీంతో పాటు టికెట్‌ కౌంటర్ల వద్ద నకిలీ నోట్లు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.

పెరుగుతున్న ఇ-టికెటింగ్‌ల సంఖ్య

IRCTC వెబ్‌సైట్/సర్వర్‌ల సామర్థ్యాన్ని మరింత పటిష్టంగా నిర్వహించడం కోసం మరింత పటిష్టంగా ఉండేలా వాటిని క్రమంగా బలోపేతం చేయడం, అప్‌గ్రేడ్ చేయడం అవసరమని కమిటీ మంత్రిత్వ శాఖకు తెలిపింది. IRCTCకి 7.60 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌ను బలోపేతం చేయడానికి 2014లో ప్రారంభించిన సిస్టమ్ సామర్థ్యాన్ని నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన సమాధానంలో కమిటీకి తెలిపింది. డిసెంబర్ 2021 నాటికి భారతీయ రైల్వే ఇ-టికెటింగ్ కింద మొత్తం రిజర్వ్ చేసిన టిక్కెట్ల వాటా 80.5 శాతానికి చేరుకుంది. IRCTCకి 100 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారని, అందులో 760 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని ఆయన చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2016-17 సంవత్సరంలో భారతీయ రైల్వేలో మొత్తం రిజర్వ్ చేసిన టిక్కెట్లలో ఇ-టికెట్ల వాటా 59.9 శాతం. 2018-19 సంవత్సరంలో 70.1 శాతం, 2019-20 సంవత్సరంలో 72.8 శాతం, 2020-21 సంవత్సరంలో 79.6 శాతం, 2021-22లో డిసెంబర్‌ వరకు 80.5 శాతం వరకు నమోదు చేయబడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి