AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPS Vatsalya: కేవలం రూ.10 వేల పెట్టుబడితో చేతికి రూ.2.75 కోట్లు.. ఎలాగో తెలుసా?

NPS Vatsalya Scheme: పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ ఎన్‌పీఎస్‌ వాత్సల్య యోజన పథకాన్ని ప్రారంభించవచ్చు. పిల్లలకు సరిగ్గా 18 ఏళ్లు వచ్చినప్పుడు ఈ ఖాతా NPS ఖాతాలోకి మారుతుంది. అటువంటి ఖాతా బదిలీ KYC ధృవీకరణకు లోబడి ఉంటుంది. మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే..

NPS Vatsalya: కేవలం రూ.10 వేల పెట్టుబడితో చేతికి రూ.2.75 కోట్లు.. ఎలాగో తెలుసా?
Subhash Goud
|

Updated on: Jan 14, 2025 | 2:28 PM

Share

భారతదేశంలోని చిన్నారుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రత్యేక పొదుపు పథకాలను అమలు చేస్తున్నాయి. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్‌పీఎస్‌ వాత్సల్య యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, భారతదేశంలోని 75 ప్రదేశాలలో ప్రారంభించారు. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడి పెట్టడానికి ఈ పథకాన్ని ఉపయోగించవచ్చు. 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు/సంరక్షకులు ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతా తీసుకోవచ్చు.

NPS వాత్సల్య యోజన పథకం:

కేంద్ర ప్రభుత్వం ఈ NPS వాత్సల్య యోజన పథకం తల్లిదండ్రులకు వారి పిల్లలకు ఆర్థిక అవసరాల కోసం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకంలో తల్లిదండ్రులు ఏడాదికి రూ.10,000 చొప్పున, సుమారు 18 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే, వారికి 10 శాతం వడ్డీతో రూ.5 లక్షలు అందుతాయి. అంటే స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.1,80,000. ఈ మొత్తం సంవత్సరానికి దానిపై చెల్లించే 10 శాతం వడ్డీతో కలిపి లభిస్తుంది. ఇది 60 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే 10 శాతం వడ్డీ రేటుతో రూ.2.75 కోట్లుగా మారుతుంది.

మీరు ఎన్‌పిఎస్ వాత్సల్య యోజనలో ఏటా రూ. 10,000 ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 18 ఏళ్లపాటు ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మొత్తం రూ. 5 లక్షలు డిపాజిట్ అవుతుంది. ఈ పెట్టుబడి సంవత్సరానికి సగటున 10% రాబడిని ఇస్తుంది. 60 సంవత్సరాల వయస్సు వరకు ఈ ఫండ్ నుండి ఎటువంటి ఉపసంహరణ చేయకపోతే, మీ మొత్తం ఫండ్ రూ. 2.75 కోట్లకు చేరుకుంటుంది.

NPS వాత్సల్య యోజన పథకం ప్రత్యేక లక్షణాలు:

పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ ఎన్‌పీఎస్‌ వాత్సల్య యోజన పథకాన్ని ప్రారంభించవచ్చు. పిల్లలకు సరిగ్గా 18 ఏళ్లు వచ్చినప్పుడు ఈ ఖాతా NPS ఖాతాలోకి మారుతుంది. అటువంటి ఖాతా బదిలీ KYC ధృవీకరణకు లోబడి ఉంటుంది. మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, విద్య, వైద్యంతో సహా అవసరమైన అవసరాల కారణంగా మీరు 25 శాతం వరకు డబ్బును ఉపసంహరించుకోవచ్చు. దీని ప్రకారం, ఒక ఖాతా మెచ్యూరిటీకి ముందు మూడు ఉపసంహరణలు అనుమతి ఉంటుంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న పిల్లలు ఊహించని విధంగా చనిపోతే, పెట్టుబడి పెట్టిన మొత్తం యజమానికి చెల్లించబడుతుందని గమనించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి