AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani Security: ముఖేష్‌ అంబానీకి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో తెలిస్తే షాకవుతారు!

ముఖేష్ అంబానీకి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది. ఆ సమయంలో సదరు వ్యాపారికి హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ భద్రతా వ్యవస్థను ఇచ్చింది. ఇది కాకుండా, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి కూడా 2016 సంవత్సరంలో వై ప్లస్ భద్రత కల్పించారు. ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్..

Mukesh Ambani Security: ముఖేష్‌ అంబానీకి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో తెలిస్తే షాకవుతారు!
Mukesh Ambani Security
Subhash Goud
|

Updated on: Oct 28, 2023 | 4:58 PM

Share

దేశంలోనే అత్యంత సంపన్నుడు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కొనసాగుతోంది.కొన్ని నెలల క్రితమే ముఖేష్ అంబానీకి ఈ తరహా బెదిరింపు రాగా, తాజాగా మరోసారి బెదిరింపు రావడం కలకలం రేపుతోంది.

అంబానీ భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది?

ముఖేష్ అంబానీ భద్రతా వ్యవస్థ చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో 50 మందికి పైగా CRPF కమాండోలు అంబానీ కుటుంబానికి చెందిన భద్రతా వ్యవస్థలో 24 గంటలు మోహరించి ఉంటారు. కమాండోలు అనేక అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నారు. వీటిలో జర్మన్ తయారు చేసిన హెక్లర్, కోచ్ MP5 సబ్ మెషిన్ గన్‌లు ఉన్నాయి. ఈ తుపాకీ ఒక్క నిమిషంలో 800 రౌండ్లు కాల్చగలదు. ముఖేష్ అంబానీకి 6 రౌండ్ ది క్లాక్ ట్రైనింగ్ డ్రైవర్లు కూడా ఉన్నారు.

ముఖేష్ అంబానీకి వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు :

ఇది కాకుండా ముఖేష్ అంబానీకి దాదాపు 15 నుండి 20 మంది వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వారి వద్ద ఆయుధాలు ఉండవు. ఈ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులకు ఇజ్రాయెలీ సెక్యూరిటీ కంపెనీ శిక్షణ ఇచ్చింది. ఈ సెక్యూరిటీ గార్డులలో రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ సిబ్బంది కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

నీతా అంబానీకి వై ప్లస్ సెక్యూరిటీ స్కీమ్:

2013లో ముఖేష్ అంబానీకి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది. ఆ సమయంలో సదరు వ్యాపారికి హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ భద్రతా వ్యవస్థను ఇచ్చింది. ఇది కాకుండా, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి కూడా 2016 సంవత్సరంలో వై ప్లస్ భద్రత కల్పించారు. ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ సెక్యూరిటీని ఇచ్చింది. ఇది కాకుండా, 8 నెలల క్రితం కూడా, ముఖేష్ అంబానీ, అతని కుటుంబానికి భారతదేశం, విదేశాలలో కూడా Z ప్లస్ స్థాయి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆ ఖర్చును అంబానీ కుటుంబమే భరిస్తుంది. అంతకుముందు ఈ ఖర్చును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భరించింది. Z Plus సెక్యూరిటీ ఖర్చు నెలకు 40 నుండి 45 లక్షల రూపాయలు అని తెలుస్తోంది. ఒక విధంగా అంబానీ సెక్యూరిటీ పర్మిషన్‌ లేనిది చీమైనా దూరేందుకు అవకాశం లేకుండా ఉంటుంది. అయితే తాజాగా ముఖేష్‌ అంబానీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం కలకలం సృష్టిస్తోంది. దీనిపై ప్రత్యేక పోలీసులు బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే