Mukesh Ambani: అంబానీ ప్రతి వారం ఏ రెస్టారెంట్ నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తారో తెలుసా?

|

Mar 09, 2024 | 3:20 PM

దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ తన సమయాన్ని పనికి దూరంగా గడపడానికి ఇష్టపడతాడు. అంబానీ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఖాళీ సమయాల్లో భార్య నీతాతో కలిసి సినిమాలు చూస్తానని చెప్పాడు. ముఖేష్ అంబానీ ఏ రెస్టారెంట్‌లో తినడానికి, తాగడానికి ఇష్టపడతారో కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. ముంబైలో అలాంటి రెస్టారెంట్ ఒకటి ఉంది. అతను దాదాపు ప్రతి వారం తినడానికి వెళ్తాడు..

Mukesh Ambani: అంబానీ ప్రతి వారం ఏ రెస్టారెంట్ నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తారో తెలుసా?
Mukesh Ambani
Follow us on

దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ తన సమయాన్ని పనికి దూరంగా గడపడానికి ఇష్టపడతాడు. అంబానీ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఖాళీ సమయాల్లో భార్య నీతాతో కలిసి సినిమాలు చూస్తానని చెప్పాడు. ముఖేష్ అంబానీ ఏ రెస్టారెంట్‌లో తినడానికి, తాగడానికి ఇష్టపడతారో కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. ముంబైలో అలాంటి రెస్టారెంట్ ఒకటి ఉంది. అతను దాదాపు ప్రతి వారం తినడానికి వెళ్తాడు.

ముంబైలోని ఆ రెస్టారెంట్ పేరు ‘కేఫ్ మైసూర్’. కాలేజీలో చదువుతున్నప్పుడు నిత్యం అక్కడికి వెళ్లేవారు. ఇప్పుడు అక్కడికి వెళ్లడం కుదరక పోయినా.. అక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్ చేయడం ఆయనకు ఇష్టం. ఇష్టమైన ఆహారం ఇడ్లీ, దోస. అతనికి సౌత్ ఇండియన్ ఫుడ్స్ అంటే ఇష్టం.

కేఫ్ మైసూర్ ముంబైలోని పురాతన దక్షిణ భారత రెస్టారెంట్లలో ఒకటి. ఈ రెస్టారెంట్ 1936లో నిర్మించించారు. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రోడ్డులోని ఈ రెస్టారెంట్ ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి బుధవారం మూసివేస్తారు. ఈ రెస్టారెంట్‌లో దోస, ఇడ్లీ కాకుండా శాండ్‌విచ్‌లు, స్ట్రీట్ ఫుడ్, స్వీట్లు మొదలైనవి కూడా అందిస్తారు. ఈ రెస్టారెంట్‌లో కనీసం 81 రకాల దోసలు లభిస్తాయి. మీరు ఈ రెస్టారెంట్ నుండి ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. రైస్, ఉప్మా, పూరీ, స్వీట్లు, లస్సీ, మిల్క్ షేక్ మొదలైనవన్నీ ఆర్డర్ చేయవచ్చు.

దేశంలోనే అత్యంత సంపన్నుడిగానే కాదు, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ టెన్ లో అతని పేరు కూడా ఉంది. ఆయన ఇంట్లో ఇప్పుడు సంతోషకరమైన వాతావరణం నెలకొంది. అంబానీ చిన్న కొడుకు అనంత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగిన విషయం తెలిసిందే. అంబానీ కుమారుడి వివాహ వేడుకకు అమెరికన్ పాప్ సింగర్ రిహన్నా వచ్చారు. బాలీవుడ్‌లోని స్టార్‌లు, ప్రపంచంలోని పెద్ద వ్యాపారవేత్తలు అందరూ ఉన్నారు. ఇక ముకేశ్ అంబానీ తన కొడుకు పెళ్లితో రికార్డు సృష్టించబోతున్నాడు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వివాహం కానుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..