Mobile Tariff Hike: కొత్త ఏడాదిలో టెలికాం కంపెనీలు మొబైల్‌ టారిఫ్‌లను పెంచనున్నాయా..? ఎంత పెరుగుతుంది?

|

Dec 23, 2022 | 7:56 AM

టెలికాం కంపెనీలు కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేలా రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలయన్స్‌ జియో.

Mobile Tariff Hike: కొత్త ఏడాదిలో టెలికాం కంపెనీలు మొబైల్‌ టారిఫ్‌లను పెంచనున్నాయా..? ఎంత పెరుగుతుంది?
Mobile Triff
Follow us on

టెలికాం కంపెనీలు కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేలా రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు మార్కెట్లోకి దూసుకుపోయేందుకు పోటీ పడుతున్నాయి. ఇక కొత్త సంవత్సరంలో మొబైల్ ఫోన్ టారిఫ్ ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది. కొత్త సంవత్సరంలో మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచుతున్నట్లు టెలికాం కంపెనీలు ప్రకటించే అవకాశం కనిపిస్తోందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ విశ్లేషకులు తమ నివేదికలో పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాల్లో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచవచ్చని జెఫరీస్ తన తాజా నివేదికలో వెల్లడించింది. కంపెనీల టారిఫ్‌లను పెంచడం వల్ల తమకు అందాల్సిన ప్రయోజనం ఇప్పుడు పూర్తయిందని, అయితే కంపెనీ ఆదాయం, మార్జిన్‌పై ఒత్తిడి మళ్లీ పెరుగుతోందని నివేదికలో తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికంలో టెలికాం కంపెనీల సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ)లో స్వల్ప పెరుగుదల ఉంది. రిలయన్స్ జియో ఏఆర్‌పీయూ 0.8 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 4 శాతం,వొడాఫోన్ ఐడియా ఏఆర్‌పీయూ 1 శాతం పెరిగాయి. ఎంపిక చేసిన సర్కిల్‌లలో భారతీ ఎయిర్‌టెల్ రూ.99 ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌ను ఉపసంహరించుకుంది. ఇప్పుడు 28 రోజుల టారిఫ్ ప్లాన్ కోసం రూ.99కి బదులుగా రూ.155 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ ఈ రీఛార్జ్ ప్లాన్‌ను హర్యానా, ఒడిశాలో విడుదల చేసింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించవచ్చని భావిస్తున్నారు.

5G సేవను ప్రారంభించడం వల్ల ఒత్తిడి:

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశంలోని అనేక నగరాల్లో 5G మొబైల్ సేవలను ప్రారంభించాయి. ఈ కంపెనీలు 5 స్పెక్ట్రమ్‌లను పొందడానికి వేలంలో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించాయి. ప్రస్తుతం ఉన్న మూడు టెలికాం కంపెనీలు 5జీ స్పెక్ట్రమ్ వేలంలో రూ.1,50,173 కోట్లు వెచ్చించాయి. ఈ కంపెనీలు లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌ను పెంచాల్సి ఉంటుంది. గత 2021 సంవత్సరంలో ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కాకుండా, రిలయన్స్ జియో ప్రీపెయిడ్ మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది. కానీ రాబోయే కాలంలో టెలికాం కంపెనీలు ఇప్పుడు ప్రీపెయిడ్‌తో పోస్ట్‌పెయిడ్ మొబైల్ టారిఫ్‌లను పెంచవచ్చు. మరో మొబైల్ టారిఫ్‌ను పెంచవచ్చని ఇప్పటికే అన్ని టెలికాం కంపెనీల టాప్ మేనేజ్‌మెంట్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి