AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! అతి తక్కువ వడ్డీకే రుణాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన కింద విద్యా రుణాలపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు 7.50 శాతం నుండి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. ఈ పథకం అర్హతగల ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. వడ్డీ సబ్సిడీ కూడా అందుబాటులో ఉంది.

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! అతి తక్కువ వడ్డీకే రుణాలు
Pm Vidyalaxmi Scheme
SN Pasha
|

Updated on: Jun 04, 2025 | 4:32 PM

Share

ఉన్నత విద్య కోసం రుణం తీసుకునే విద్యార్థులకు ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన కింద విద్యా రుణాన్ని 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రుణం తీసుకునే విద్యార్థులు ఇప్పుడు తక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఉన్నత విద్య కోసం రుణ ప్రక్రియను సులభతరం చేయడం, తక్కువ వడ్డీకి ఇవ్వడం ఈ ప్రభుత్వ పథకం ఉద్దేశ్యం. మీరు ఈ పథకం కింద రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, దాని గురించి పూర్తిగా తెలుసుకోండి..

ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం అంటే ఏమిటి?

ఇది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం. దేశంలోని 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో (QHEIs) మెరిట్ ఆధారంగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన ఉన్నత విద్యా సంస్థలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్న భారతీయ పౌరులు, NRIలు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) విద్యార్థులు ఈ పథకం కింద అర్హులు.

వడ్డీ రేటు ఎంత..?

PNB విద్యా రుణంపై వడ్డీ రేటును 0.20 శాతం తగ్గించింది. ఇప్పుడు ఈ పథకం కింద వడ్డీ రేటు సంవత్సరానికి 7.50 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఈ రేటు సంస్థ నాణ్యత రేటింగ్‌పై ఆధారపడి ఉంటుంది. రుణం పొందడానికి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ తల్లిదండ్రులు ఉమ్మడి రుణగ్రహీతలుగా ఉండాలి.

మీకు ఎంత సబ్సిడీ లభిస్తుంది?

ఈ పథకం కింద దేశంలోని 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో మెరిట్ ఆధారంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు మాత్రమే రుణాలు లభిస్తాయి. విద్యార్థులు సాంకేతిక లేదా ప్రొఫెషనల్ కోర్సులు చేస్తుంటే, వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షల వరకు ఉంటే, వారికి వడ్డీపై 100 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఆదాయం రూ. 4.5 లక్షల నుండి రూ.8 లక్షల మధ్య ఉంటే, 3 శాతం వడ్డీ సబ్సిడీ ఇవ్వబడుతుంది.

నిబంధనలు, షరతులు

విద్యార్థి AAA లేదా AA రేటింగ్ ఉన్న సంస్థలో చదువుతుంటే, అతను రుణం తీసుకోవడానికి ఎటువంటి మార్జిన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర సంస్థలలో, రుణం రూ. 4 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఎటువంటి మార్జిన్ చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ రూ. 4 లక్షలకు పైగా రుణాలపై 5 శాతం మార్జిన్ చెల్లించాలి. విద్యార్థి అవసరాన్ని బట్టి రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి

ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్
ఇక ఎటువంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..
ఇక ఎటువంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..