AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Plan: ఎల్‌ఐసీలో అదిరిపోయే ప్లాన్‌.. రోజుకు రూ.71 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.48 లక్షల ఆదాయం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ. దేశంలో కోట్లాది మంది పాలసీదారులు ఉన్నారు. మార్కెట్లో అనేక పెట్టుబడి ఆప్షన్స్‌ ఉన్నప్పటికీ..

LIC Plan: ఎల్‌ఐసీలో అదిరిపోయే ప్లాన్‌.. రోజుకు రూ.71 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.48 లక్షల ఆదాయం
Lic New Endowment Plan
Subhash Goud
|

Updated on: Dec 12, 2022 | 8:18 PM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ. దేశంలో కోట్లాది మంది పాలసీదారులు ఉన్నారు. మార్కెట్లో అనేక పెట్టుబడి ఆప్షన్స్‌ ఉన్నప్పటికీ, ప్రజలు ఇప్పటికీ ఎల్‌ఐసీలోని పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. మీరు కూడా ఎల్‌ఐసీ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే అందులో మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా బలమైన రాబడిని పొందవచ్చు. ఇక ఎల్‌ఐసీలో ఉన్న పథకాలలో ఎండోమెంట్ ప్లాన్ ఒకటి. ఈ పథకంలో మీరు ప్రతిరోజూ రూ.71 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీపై ఏకమొత్తంలో రూ.48.75 లక్షలు అందుతాయి.

ఎల్‌ఐసీ కొత్త ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ ఏమిటి?

ఎల్‌ఐసీ కొత్త ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ అనేది నాన్-లింక్డ్, పార్టిసిటింగ్, వ్యక్తిగత, జీవిత బీమా ప్లాన్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పొదుపు , బీమా రక్షణ రెండింటి ప్రయోజనాన్ని పొందుతారు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడిదారుడు డెత్ బెనిఫిట్‌ని కూడా పొందుతాడు. పెట్టుబడిదారుడు మరణిస్తే అతని కుటుంబం (నామినీ) హామీ మొత్తం ప్రయోజనం పొందుతుంది. మరోవైపు పాలసీదారు మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే అతను మెచ్యూరిటీపై పూర్తి డబ్బును పొందుతాడు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు రుణ సదుపాయాన్ని కూడా పొందుతారు.

ఎండోమెంట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడానికి అర్హత ఏమిటి

☛ పథకం కనీస హామీ మొత్తం – 1 లక్ష

ఇవి కూడా చదవండి

☛ మాక్సిస్ సమ్ అష్యూర్డ్ – పరిమితి లేదు

☛ పథకంలో పెట్టుబడి కనీస వయస్సు – 8 సంవత్సరాలు

☛ పథకంలో పెట్టుబడి గరిష్ట వయస్సు – 55 సంవత్సరాలు

☛ పథకం మెచ్యూరిటీ గరిష్ట వయస్సు – 75 సంవత్సరాలు

☛ పాలసీ వ్యవధి – 12 నుండి 35 సంవత్సరాలు

మీరు 18 సంవత్సరాల వయస్సులో ఎల్‌ఐసీ కొత్త ఎండోమెంట్ ప్లాన్‌ని కొనుగోలు చేసి, 35 సంవత్సరాల కాలవ్యవధిని ఎంచుకుంటే మీరు ప్రతి సంవత్సరం రూ. 26,534 వార్షిక ప్రీమియం రూ. 10 లక్షల మొత్తానికి చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో రెండవ సంవత్సరం నుండి ఈ ప్రీమియం రూ.25,962కి తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ చూసుకుంటే రూ.71 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఈ సందర్భంలో పెట్టుబడిదారు మెచ్యూరిటీపై రూ. 48.75 లక్షలు పొందుతారు. ఈ పథకంలో మీ మొత్తం పెట్టుబడి మొత్తం రూ. 9.09 లక్షలు అయితే మీరు రూ. 48 లక్షల కంటే ఎక్కువ రాబడిని పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి