అనంత్- రాధికల పెళ్లి వేడుకలపై ఫేక్‌ న్యూస్‌ ప్రచారం.. ఏం జరిగిందంటే..!

|

Jul 26, 2024 | 4:08 PM

తాజాగా వారి పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ వార్త ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకల్లో భాగంగా లండన్‌లోని ప్రఖ్యాత స్టోక్ పార్క్ 7 స్టార్ లగ్జరీ హోటల్‌లో అనంత్‌- రాధికల పోస్ట్‌ వెడ్డింగ్‌ కార్యక్రమాలు రెండు నెలల పాటు నిర్వహించేలా ముఖేష్ అంబానీ ప్లాన్ చేసినట్లు ..

అనంత్- రాధికల పెళ్లి వేడుకలపై ఫేక్‌ న్యూస్‌ ప్రచారం.. ఏం జరిగిందంటే..!
Ambani Wedding
Follow us on

ప్రస్తుతం గత కొద్ది రోజులుగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ విశేషాలకు సంబంధించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా వారి పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ వార్త ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకల్లో భాగంగా లండన్‌లోని ప్రఖ్యాత స్టోక్ పార్క్ 7 స్టార్ లగ్జరీ హోటల్‌లో అనంత్‌- రాధికల పోస్ట్‌ వెడ్డింగ్‌ కార్యక్రమాలు రెండు నెలల పాటు నిర్వహించేలా ముఖేష్ అంబానీ ప్లాన్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికోసం అంబానీ ఫ్యామిలీ మరో 2,000 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఖర్చు చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.

సెవెన్ స్టార్ స్టోక్ పార్క్ హోటల్‌ ఈ ఫేక్ న్యూస్​ను ఖండించింది. సాధారణంగా తాము ప్రైవేట్ వ్యవహారాల గురించి మాట్లాడమని, కానీ మీడియాలో తప్పుడు వార్తలు వచ్చిన నేపథ్యంలో, దీనిపై క్లారిటీ ఇస్తున్నామని పేర్కొంది. తమ హోటల్​లో అనంత్-రాధిక దంపతులు ఎలాంటి వేడుకలు చేసుకోవటం లేదని స్పష్టం చేసింది. అంబానీ కుటుంబ సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి