
Best Scheme: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పోస్టాఫీసులలో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ పథకాలను అమలు చేస్తోంది కేంద్రం. అయితే మంచి రాబడి పొందేందుకు పోస్టాఫీసులలో వివిధ స్కీమ్లను అమలు చేస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈ పథకాలలో ఎలాంటి రిస్క్ ఉండదు. ప్రభుత్వం గ్యారంటి ఇస్తోంది. అందుకు ఈ ప్రభుత్వ పథకాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. మీరు 5 లక్షలు పెట్టుబడి పెడితే 10 లక్షలు వస్తాయా? అవును, ప్రభుత్వ హామీతో ఇది సాధ్యమే! కిసాన్ వికాస్ పత్ర (KVP) అనేది ఒక సురక్షితమైన ప్రభుత్వ పథకం. ఇది పోస్ట్ ఆఫీస్ ద్వారా అందుబాటులో ఉంది. ఈ పథకంలో మీరు చేసే పెట్టుబడికి ప్రభుత్వమే గ్యారెంటీ.
ఈ స్కీమ్ కింద, మీరు 10 లక్షలు పెట్టుబడి పెడితే, 115 నెలల్లో అది 20 లక్షలుగా మీకు తిరిగి వస్తుంది. ప్రస్తుతం దీనిపై 7.5% వడ్డీ లభిస్తుంది. అప్పుడప్పుడు ఈ పథకాలపై వడ్డీ రేట్లలో మార్పులు ఉండవచ్చు. కనీసం రూ.1000 నుండి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ఒక వన్-టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్.
ఇది కూడా చదవండి: 45 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 10 నిమిషాల్లోనే.. కొత్త ఎయిర్ ట్యాక్సీ సర్వీసు!
బయట మార్కెట్లలో ఎక్కువ రాబడి ఉన్నప్పటికీ, అక్కడ సెక్యూరిటీ ఉండదు. కానీ KVP లో మీ డబ్బు 100% సురక్షితం. దీర్ఘకాలికంగా డబ్బు భద్రత, స్థిరమైన వృద్ధి కోరుకునే వారికి ఈ పథకం చాలా అనుకూలం. పెట్టుబడిదారునికి మధ్యలో ఏదైనా జరిగితే, అప్పటివరకు వచ్చిన అసలు, వడ్డీ నామినీకి చెల్లిస్తారు. ఈ పథకం ద్వారా మీ ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కల్పించుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి