IT Indsutry: నిరుద్యోగులకు శుభవార్త.. దేశంలో ఐటీ కంపెనీలకు లాభాల జోరు.. లక్షకు పైగా కొత్త ఉద్యోగాలకు అవకాశాలు!

| Edited By: KVD Varma

Jul 16, 2021 | 8:17 AM

IT Indsutry: కరోనా నేపథ్యంలో ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు శుభవార్తను మోసుకొచ్చాయి మన ఐటీ కంపెనీలు.

IT Indsutry: నిరుద్యోగులకు శుభవార్త.. దేశంలో ఐటీ కంపెనీలకు లాభాల జోరు.. లక్షకు పైగా కొత్త ఉద్యోగాలకు అవకాశాలు!
It Industry
Follow us on

IT Indsutry: కరోనా నేపథ్యంలో ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు శుభవార్తను మోసుకొచ్చాయి మన ఐటీ కంపెనీలు. దేశంలోని మూడు అతిపెద్ద ఐటీ కంపెనీలు మెరుగైన ఆర్ధిక ఫలితాలను ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో అందుకున్నాయి. దీంతో మందగమనంలో నడుస్తున్న ఐటీ పరిశ్రమ తిరిగి కోలుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ముగిసిన త్రైమాసికంలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో 17,446 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయి. దీంతో ఈ సంవత్సరంలో దాదాపు లక్షా ఐదువేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఈ కంపెనీలు హామీ ఇస్తున్నాయి.

10 సంవత్సరాలలో ఇన్ఫోసిస్ అత్యధిక లాభం

ఐటీ సెక్టార్ లో దేశంలోని అతిపెద్ద సంస్థగా పరిగనిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) జూన్ త్రైమాసికంలో రూ 9,000 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. అదేవిధంగా విప్రో సంస్థ కూడా మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .2,390 కోట్లతో పోలిస్తే కంపెనీ 3,243 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. ఇక, మరో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కూడా మొదటి త్రైమాసికంలో గత పదేళ్ళలో అత్యధిక లాభాలను ఆర్జించింది. ఇది రూ .5,195 కోట్లు. ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండి సలీల్ పరేఖ్ మాట్లాడుతూ మొదటి త్రైమాసికంలో ఇది ఒక దశాబ్దంలో అత్యంత వేగవంతమైన వృద్ధి అని చెప్పారు.

త్రైమాసిక ఫలితాలను విడుదల సందర్భంగా, విప్రో తన ఆదాయం కూడా జూన్ త్రైమాసికంలో 12% పెరిగి రూ .18,252 కోట్లకు చేరుకున్నట్టు చెప్పింది. ఇది ఏడాది క్రితం రూ .14,913 కోట్లుగా ఉండేది. ఇవే కాకుండా ఐటి సేవల ద్వారా వచ్చే ఆదాయం రూ .18,048 కోట్లు ఉందని సంస్థ తెలిపింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ 129 మంది కొత్త కస్టమర్లను తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకున్నట్టు వివరించింది. జూలై-సెప్టెంబరులో 6000 మంది ఐటి నిపుణులకు ఉద్యోగాలు ఇస్తామని, 2021-22లో 30,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా విప్రో హామీ ఇచ్చింది.

కరోనా కారణంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నాయి. ఇది మంచి ఫలితాలను రాబట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆన్‌లైన్ విద్య వంటి కార్యకలాపాల వలన కంపెనీలకు పెద్ద ఒప్పందాలు వచ్చాయి. నిపుణులు చెబుతున్న సమాచారం ప్రకారం, జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌కు రూ .19,381 కోట్లు, టిసిఎస్‌కు రూ .60,381 కోట్లు ప్రాజెక్టులు చేతికి వచ్చాయి. ఇవే కాకుండా విప్రోకు కూడా రూ .5,325 కోట్ల విలువైన 8 కొత్త ఒప్పందాలు వచ్చాయి.

సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్, రిలయన్స్ సెక్యూరిటీస్, క్లౌడ్, డేటా అనలిటిక్స్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్, సైబర్ వంటివి రాబోయే రోజుల్లో ఐటి రంగానికి కీలకమైన డ్రైవర్లుగా ఉంటాయని సుయోగ్ కులకర్ణి తెలిపారు. ఇది కాకుండా, ఐరోపాలో అవుట్‌సోర్సింగ్‌లో పెరుగుతున్న వాటా, కన్సల్టెన్సీ విస్తరణ, ఇంజనీరింగ్ ఆర్‌అండ్‌డి కూడా చాలా ముఖ్యమైనవి అని ఆయన వివరించారు.

టిసిఎస్, ఇన్ఫోసిస్ షేర్లపై సలహాలు..

ఈ ఫలితాల తరువాత నిపుణులు ఐటీ రంగంలోని అతిపెద్ద కంపెనీల షేర్లపై 2 సంవత్సరాల కాలపరిమితితో షేర్లను కొనుగోలు చేయవచ్చని సలహా ఇచ్చారు. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి రూ .3201.50 వద్ద ముగిసిన టిసిఎస్ వాటాపై రూ .4,180 టార్గెట్ ఇచ్చారు. అదేవిధంగా ఇన్ఫోసిస్ స్టాక్‌పై రూ .1,920 టార్గెట్ సూచించారు.

Also Read: Amazon partner: చిన్న మొత్తంతో పెద్ద బిజినెస్‌.. దుకాణాదారులకు లాభాలను ఆర్జించిపెడుతోన్న ఫ్రాంచైజ్‌.. వీడియో

Maruti Suzuki: కార్ల కంపెనీ మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. రూ.18 వేల కోట్లతో కొత్త ప్లాంట్‌