AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indigo: ఇండిగో ప్రతిరోజూ 6-12 విమానాలను రద్దు చేస్తోంది.. కారణం ఏంటో తెలుసా?

సామర్థ్యానికి మించి విమానాల సంఖ్య, రన్‌వేపై నిత్యం రద్దీ కారణంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు దాదాపు 40-60 నిమిషాల పాటు అనవసరంగా తిరుగుతున్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని కారణంగా ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుంది. విమానం అదనపు ఇంధనం కూడా ఖర్చు అవుతుంది. ఈ విషయాలన్నింటిని దృష్టిలో..

Indigo: ఇండిగో ప్రతిరోజూ 6-12 విమానాలను రద్దు చేస్తోంది.. కారణం ఏంటో తెలుసా?
Mumbai Airport
Subhash Goud
|

Updated on: Feb 19, 2024 | 5:11 PM

Share

ముంబై విమానాల్లో చాలా రద్దీ కనిపిస్తోంది. ఎక్కువ విమానాలు ప్రయాణిస్తున్నందున, రన్‌వేపై నిరంతర రద్దీ ఉన్నందున ఇండిగో ప్రతిరోజూ 6 నుండి 12 విమానాలను రద్దు చేస్తోంది. అయితే రద్దులను తగ్గించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని విమానయాన సంస్థ చెబుతోంది. అసలైన విషయం ఏమిటంటే, చాలా విమానాల సమయం 1 నుండి 2 నిమిషాలు వెనుకబడి ఉంటుంది. ఒకే రన్‌వే ఉన్నందున వాటిని ల్యాండ్ చేయడం సాధ్యం కాదు. దీంతో దాదాపు 40 నుంచి 60 నిమిషాల పాటు విమానం అనవసరంగా ముంబయి విమానాశ్రయంపై తిరగాల్సి వస్తోంది.

కారణం ఏంటి?

సామర్థ్యానికి మించి విమానాల సంఖ్య, రన్‌వేపై నిత్యం రద్దీ కారణంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు దాదాపు 40-60 నిమిషాల పాటు అనవసరంగా తిరుగుతున్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని కారణంగా ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుంది. విమానం అదనపు ఇంధనం కూడా ఖర్చు అవుతుంది. ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని విమానయాన మంత్రిత్వ శాఖ గత బుధవారం ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఎక్కువ విమానాలు ఉన్నాయి. అలాగే రెండు టేకాఫ్‌ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఇబ్బందిగా మారిపోతుంది.

ప్రతిరోజూ 6-12 విమానాలు రద్దు

ఈ కారణాల వల్ల ఇండిగో రోజూ 6 నుంచి 12 విమానాలను రద్దు చేస్తోంది. అయితే రద్దులను తగ్గించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని విమానయాన సంస్థ చెబుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆ స్లాట్‌లో విమానాలు లేవు కాబట్టి చాలా తక్కువ ప్రభావం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం సమయం ఇచ్చింది

ఈ సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ప్రభుత్వం ఇండిగోను కోరింది. కనీసం విమానాలనైనా రద్దు.. విమానయాన సంస్థలు స్లాట్‌లు, షెడ్యూల్‌లను అనుసరించకపోవడం సమస్యను పెంచుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. అదనపు ఖర్చుల భారం అంతిమంగా వినియోగదారులపై పడే అవకాశం ఉంది. ఇది ప్రయాణికులు, విమానయాన సంస్థలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

ఒక్కో విమానంలో రూ.2.6 లక్షలు వృథా:

దూర ప్రయాణాల్లో ఇంధన వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోందని మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక విమానం సగటున గంటకు 2,000 కిలోల ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఇలాంటి జాప్యాల వల్ల 1.7 నుంచి 2.5 కిలోలీటర్ల జెట్ ఇంధనం వృథా అవుతుందని, దీని ఫలితంగా ఒక్కో విమానానికి దాదాపు రూ.1.8 నుంచి 2.6 లక్షల ఆర్థిక భారం పడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us