Market Update: రేటు పెరిగింది.. మార్కెట్ పడింది.. నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

Market Update: నిన్న రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేటు పెంచటంతో ఊపందుకున్నట్లు కనిపించిన మార్కెట్లు సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి.

Market Update: రేటు పెరిగింది.. మార్కెట్ పడింది.. నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
Stock Market
Follow us

|

Updated on: Jun 09, 2022 | 10:11 AM

Market Update: నిన్న రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేటు పెంచటంతో ఊపందుకున్నట్లు కనిపించిన మార్కెట్లు సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ ప్రభావం ఈరోజు కూడా అలాగే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా బెంట్ మార్క్ సూచీలు ప్రీ ఓపెనింగ్ లోనే 0.50 శాతం మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటల సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 190 పాయింట్లు, నిఫ్టీ -50 సూచీ 57 పాయింట్లు నష్టపోయాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 231 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 120 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి తోడు ప్రపంచ మార్కెట్లు సైతం నష్టాల్లో క్లోజ్ కావటం వల్ల ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది.

నిఫ్టీ సూచీలో ఓఎన్జీసీ 2.14%, డాక్టర్ రెడ్డీస్ 2.05%, గెయిల్ 1.25%, కోల్ ఇండియా 1.14%, బజాజ్ ఆటో 1.07%, భారతీ ఎయిర్ టెల్ 0.92%, సిప్లా 0.82%, లుపిన్ 0.77%, యూపీఎల్ 0.69%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.68% మేర లాభపడి ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 3.30%, టాటా స్టీల్ 1.60%, గ్రాసిమ్ 1.29%, పవర్ గ్రిడ్ 1.25%, ఏషియా పెయింట్స్ 1.15%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.02%, బీపీసీఎల్ 0.91%, యాక్సిస్ బ్యాంక్ 0.85%, బజాజ్ ఫిన్ సర్వ్ 0.84%, హిందాల్కొ 0.68% శాతం నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.