Indian Railway: ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత ఆదాయం

|

Mar 13, 2022 | 4:51 PM

Indian Railway: ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఇక తాజాగా ఆదాయం పెంచేందుకు రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం..

Indian Railway: ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత ఆదాయం
Follow us on

Indian Railway: ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఇక తాజాగా ఆదాయం పెంచేందుకు రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్‌లలో సొంతంగా 100కుపైగా ఫుడ్‌ ప్లాజాలను (Food Plaza), ఫాస్ట్‌ ఫుడ్‌ (Fast Food), అవుట్‌లెట్లను, రెస్టారెంట్ల (Restaurants)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఐఆర్‌సీటీసీ (IRCTC) ద్వారా మాత్రమే కాకుండా సొంతంగా ఫుడ్‌ ప్లాజాలను ఏర్పాటు చేసి రైల్వేశాఖకు మరింతగా ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతోంది. ఐఆర్‌సీటీసీ రైళ్లు, స్టేషన్ల వద్ద కేటరింగ్‌ సేవలను అందిస్తోంది. ఈ ఫుడ్‌ ప్లాజాలను, రెస్టారెంట్లను, అవుట్‌లెట్లను ఏర్పాటు చేయడంలో ఐఆర్‌సీటీసీ విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది రైల్వే బోర్డు (Railway Board). ఈ బాధ్యతలను జోనల్‌ రైల్వేకు అప్పగించింది. స్టేషన్‌లలో ఖాళీ ఉన్న ప్రాంతాలలో ఈ ఫుడ్‌ ప్లాజాలను, రెస్టారెంట్లను,అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని 17 జోనల్‌ రైల్వే కార్యాలయాలకు అనుమతి ఇచ్చింది భారతీయ రైల్వే.

అయితే ఐఆర్‌సీటీసీకి కేటాయించిన చాలా స్థలాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రయాణికులకు సరైన సేవలు అందడం లేదని గుర్తించారు అధికారులు. రైల్వే స్టేషన్‌లలో ఖాళీగాఉన్న ఈ స్థలాలలో ఫుడ్‌ ప్లాజాలు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలని జోనల్ రైల్వేస్‌ను కోరుతూ అనుమతులు జారీ చేస్తున్నామని భారతీయ రైల్వే జారీ చేసిన తన ఆర్డర్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

News Papers: వార్తా పత్రికలు కాలక్రమేణా పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి? కారణం ఇదే

Flipkart: స్మార్ట్‌ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.? ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు..