AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!

భారత ఆర్థిక వ్యవస్థ 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం 20.7 ట్రిలియన్ డాలర్లు చేరుకోవచ్చు. అధిక పొదుపు, పెట్టుబడులు, అనుకూల జనాభా వంటి అంశాలు దీనికి కారణం.

ట్రంప్‌ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!
Donald Trump And Pm Modi
SN Pasha
|

Updated on: Aug 28, 2025 | 12:37 PM

Share

2038 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 34.2 ట్రిలియన్‌ డాలర్ల GDPతో ‍ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని, 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం పరంగా 20.7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 తర్వాత, భారత్‌ అమెరికా 2028-2030లో వరుసగా 6.5 శాతం, 2.1 శాతం సగటు వృద్ధి రేటును కొనసాగిస్తే IMF అంచనాల ప్రకారం 2038 నాటికి భారతదేశం PPP పరంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమించవచ్చు.

ఈ నెల ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో పాటు భారతదేశాన్ని ‘డెడ్‌ ఎకానమీ’ అని అభివర్ణించారు. కానీ, వాస్తవ లెక్కలు చూస్తే 2028 నాటికి మార్కెట్ మారకం రేటు పరంగా భారత్‌ జర్మనీని అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కూడా అంచనా. తగిన ప్రతిఘటనలతో ఎంపిక చేసిన భారతీయ దిగుమతులపై అమెరికా విధించే అధిక సుంకాల ప్రతికూల ప్రభావాన్ని భారతదేశం వాస్తవ GDP వృద్ధికి దాదాపు 10 బేసిస్ పాయింట్లకు పరిమితం చేయగలదు.

ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ అత్యంత డైనమిక్‌గా ఎదుగుతోందని, అధిక పొదుపు, పెట్టుబడి రేట్లు, అనుకూలమైన జనాభా, స్థిరమైన ఆర్థిక స్థితి వంటి బలమైన ఆర్థిక పునాదులతో భారత్‌ ఎదుగుతోందని EY ఎకానమీ వాచ్ ఆగస్టు 2025 సంచిక తెలిపింది. సుంకాల ఒత్తిళ్లు, వాణిజ్యం మందగించడం వంటి ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ, భారత్‌ స్థితిస్థాపకత దేశీయ డిమాండ్‌పై ఆధారపడటం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో సామర్థ్యాలను పెంచడం నుండి ఉద్భవించిందని అది తెలిపింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి