Loans: లోన్ చాలా కాస్ట్లీ గురూ.. భారీగా వడ్డీ రేట్లను పెంచిన ఈ రెండు బ్యాంకులు..

RBI Repo Rate: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులు ICICI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ రుణ రేట్లను పెంచాలని నిర్ణయించాయి. ICICI బ్యాంక్ తన EBLR ను పెంచాలని నిర్ణయించింది.

Loans: లోన్ చాలా కాస్ట్లీ గురూ.. భారీగా వడ్డీ రేట్లను పెంచిన ఈ రెండు బ్యాంకులు..
Rate Hike
Follow us

|

Updated on: Aug 06, 2022 | 1:24 PM

ఐదు వారాల వ్యవధిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) రెండోసారి వడ్డీ రేట్లు పెంచింది. మే 4న చెప్పిన రీతిలోనే శుక్రవారం ఆర్‌బీఐ వడ్డీ రేటును 50 పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేటు పెంచడం తప్పనిసరైందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 4న అనూహ్యంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను 40 పాయింట్లు పెంచింది. స్వల్ప వ్యవధిలో వడ్డీ రేట్లు ఒక శాతం పెరగడం వినియోగదారులపై తీవ్రభారంగా పరిణమించనుంది. ఆర్‌బీఐ రేట్ల పెంపుకు అనుగుణంగా బ్యాంకులు కూడా రుణాలపై రేట్లు పెంచుతాయి. దీని తరువాత, ఇప్పుడు అన్ని బ్యాంకుల రుణాలు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి. ప్రస్తుతం రెపో రేటు 5.40 శాతంగా ఉంది. RBI ప్రకటన తర్వాత, రెండు పెద్ద బ్యాంకులు తమ రుణాలపై వడ్డీని పెంచుతున్నట్లుగా నిర్ణయించాయి.

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ రుణ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును పెంచాలని నిర్ణయించింది. ఈ రేట్లు 5 ఆగస్టు 2022 నుంచి అమలులోకి వచ్చాయి. అదే సమయంలో దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ I-EBLR ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత, అది 9.10%కి చేరుకుంది. PNB తన RBI- సంబంధిత రుణ RLLR (రెపో లింక్డ్ లెండింగ్ రేటు) పెంచాలని నిర్ణయించింది. 7.40% నుంచి 7.90%కి పెరిగింది. ఈ కొత్త రేట్లు 8 ఆగస్టు 2022 నుంచి అమలులోకి వస్తాయి.

ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ అంటే ఏంటి?

2019 సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి వ్యక్తిగత రుణం, రిటైల్ లోన్ అయినా రెపో రేటుతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ అనేది ఏదైనా లోన్‌పై వసూలు చేసే అతి తక్కువ వడ్డీ రేటు. ప్రస్తుతం బ్యాంకుల్లో మూడు రకాల ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లు అమలవుతున్నాయి. ఇందులో MCLR, RLLR, EBLR రేట్లు ఉన్నాయి.

రెపో రేటు

94 రోజుల్లో 3 సార్లు పెరిగింది పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, RBI మొత్తం రెపో రేటును 94 రోజుల్లో 3 సార్లు పెంచాలని నిర్ణయించింది. తొలి రెండు విడతల్లో 0.90 బేసిస్ పాయింట్ల పెరుగుదల నమోదైంది. అదే సమయంలో ఈ కారులో మొత్తం 0.50 బేసిస్ పాయింట్ల పెరుగుదల నమోదు చేసింది. ప్రస్తుతం, RBI మొత్తం రెపో రేటు 5.40 శాతం అందిస్తోంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ రెపో రేటును నిరంతరం పెంచుతోంది.

మరిన్న బిజినెస్ వార్తల కోసం

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!